News February 23, 2025

బాపట్ల జిల్లా విద్యుత్ వినియోగదారులకు గమనిక

image

కరెంట్ బిల్లు చెల్లించుటకు బాపట్ల జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కేంద్రాలలోని కౌంటర్లు ఆదివారం తెరిచే ఉంటాయని, బాపట్ల విద్యుత్ శాఖ సూపరింటెండ్ ఇంజినీర్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి, ఇప్పటివరకు విద్యుత్ బిల్లులు చెల్లించనివారు ఆదివారం బిల్లులను చెల్లించాలని కోరారు.

Similar News

News November 3, 2025

కరీంనగర్ – జగిత్యాల ప్రయాణం.. వెరీ డేంజర్..!

image

JGTL-KNR రెండు వరసల రోడ్డు ఇరుకుగా ఉండడం, వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో అటువైపు ప్రయాణం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. దీనికి తోడు గుంతలరోడ్లు ప్రమాదాలకు వెల్కమ్ చెబుతున్నాయి. NH-563పై JGTL-KNR వరకు దాదాపు 50 కి.మీ మేర 4 లైన్ల రోడ్డు విస్తరణకు రూ.2,484కోట్లు కేంద్రం కేటాయించింది. ఈ పనులు వేగంగా ప్రారంభించకుంటే రంగారెడ్డి(D) మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలు ఇక్కడ కూడా చోటు చేసుకునే ప్రమాదం ఉంది.

News November 3, 2025

కురుమూర్తి జాతరలో ఆకతాయిల ఆగడాలు

image

కురుమూర్తి జాతరలో ఆకతాయిల దుశ్చర్యలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారీగా భక్తులు తరలివస్తుండగా కొందరు యువతులు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు మద్యం, మాంసం దుకాణాలు తెరిచి ఉండడంతో మత్తులో హంగామాలు సృష్టిస్తున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని జేబుదొంగలు మొబైల్ ఫోన్లు, ఆభరణాలు అపహరిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

News November 3, 2025

వరల్డ్ కప్ విన్.. BJP&కాంగ్రెస్ శ్రేణుల ఫైట్

image

ప్రధాని మోదీ హాజరైతే అందులో భారత్‌కు ఓటమి తప్పదని కాంగ్రెస్ శ్రేణులు ట్వీట్లు చేస్తున్నాయి. ‘మోదీ హాజరైన చంద్రయాన్-2 & 2023 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్ విఫలమైంది. అదే మోదీ గైర్హాజరైన చంద్రయాన్-3, 2024 T20 WC, 2025 WWC వంటి వాటిలో భారత్ గెలిచింది. అంటే మోదీ హాజరుకు, వైఫల్యానికి సంబంధం ఉంది’ అని సెటైర్ వేస్తున్నాయి. రాహుల్ గాంధీ ఉండటం వల్లే కాంగ్రెస్ ఓడిపోతోందని బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.