News February 23, 2025

జనగామ: గురుకుల ప్రవేశ పరీక్షకు 51 మంది గైర్హాజరు

image

జనగామ జిల్లా వ్యాప్తంగా నేడు(ఆదివారం) జరిగిన ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్షకు 51 మంది గైర్హాజరయ్యారని జిల్లా సాంఘీక సంక్షేమ గురుకుల డీసీవో శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 1,851 మంది 1,800 మంది హాజరయ్యారని తెలిపారు. ఇందులో 5వ తరగతిలో 16 మంది, 6వ తరగతిలో 14 మంది, 7వ తరగతిలో 12 మంది, 8వ తరగతిలో ఐదుగురు, 9వ తరగతిలో నలుగురు గైర్హాజరు అయ్యారని వెల్లడించారు.

Similar News

News February 24, 2025

ఉప్పల్: పదవ తరగతి చదువుతున్నారా..? మీకోసమే!

image

పదవ తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజనీరింగ్ విద్యను డిప్లమా లెవెల్లో అభ్యసించడం కోసం పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందు కోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచి విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు. 

News February 24, 2025

ఆపరేషన్ SLBC: రెండు ప్లాన్లు సిద్ధం చేసిన అధికారులు

image

TG: శనివారం ఉదయం SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ఇంకా బయటికి రాలేదు. వారిని తీసుకొచ్చేందుకు NDRF, నేవీ ప్రయత్నిస్తున్నాయి. అయితే బురద వల్ల లోనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్లాన్-ఎ, ప్లాన్-బి రూపొందించాయి. సొరంగానికి సమాంతరంగా మరొకటి తవ్వడం, పైనుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్లడం. ఈ రెండింటిపై కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు ఆ 8మంది సురక్షితంగా బయటికి రావాలని అంతా కోరుకుంటున్నారు.

News February 24, 2025

చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 24)

image

* 1911- తెలుగు రచయిత పిలకా గణపతిశాస్త్రి జననం
* 1948- తమిళనాడు మాజీ సీఎం జయలలిత జననం
* 1951- సాహితీవేత్త, విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి మరణం
* 1980- ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణం
* 2018- అతిలోక సుందరి శ్రీదేవి మరణం(ఫొటోలో)
* 1984- నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు(ఫొటోలో)

error: Content is protected !!