News February 23, 2025

మేడ్చల్: అవుషాపూర్ VBIT కాలేజ్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

ఘట్‌కేసర్ పీఎస్ పరిధి అవుషాపూర్ వీబీఐటీ కళాశాల సమీపంలో యాష్ లోడ్ లారీ యాక్టివా నడుపుతున్న యశ్వంత్(18) అనే యువకుడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. నల్గొండ జిల్లా బీబీ నగర్ మండలం జమీల్‌పేటకు చెందిన యశ్వంత్, జమీల్‌పేట నుంచి బీబీ నగర్ వైపు వెళ్తుండగా వీబీఐటీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 8, 2025

జగిత్యాల: ‘వృద్ధుల హక్కుల పరిరక్షణకు కమిషన్ అవసరం’

image

సీనియర్ సిటిజెన్స్ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి కమిషన్ ఏర్పాటు చేయాలని టాస్కా రాష్ట్ర అధ్యక్షులు పి. నర్సింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో జరిగిన ప్రతినిధి మండలి సమావేశంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 46 మంది సీనియర్ సిటిజన్లను సన్మానించారు.

News November 8, 2025

దమ్మన్నపేట రచ్చబండ…గ్రామ చరిత్రకు ప్రతీక

image

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలోకి అడుగుపెట్టగానే కనిపించే పాత వేపచెట్టు కింద ఉన్న రచ్చబండ గ్రామానికి ప్రత్యేక గుర్తుగా నిలుస్తోంది. దాదాపు 2 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ “కచ్చిరి” వద్ద నిజాం రాజు కాలంలో స్వాతంత్ర్య సమరయోధులు దేశభక్తి చర్చలు జరిపేవారని పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికీ పెద్దలు ఉదయం, సాయంత్రం కలిసి కూర్చుని గ్రామ విషయాలు మాట్లాడుకునే ఆత్మీయ స్థలంగా దీన్ని భావిస్తారు.

News November 8, 2025

రైల్వేలో 8,868 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

RRBలో 8,868 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు. గ్రాడ్యుయేట్ పోస్టులకు 18- 33ఏళ్లవారు ఈనెల 20 వరకు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18- 30ఏళ్లున్న వారు ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.