News February 23, 2025
కాంగ్రెస్కు దక్కేది గుండు సున్నానే: కిషన్రెడ్డి

TG: రాష్ట్రంలో బీజేపీ మాత్రమే 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. విద్యావంతులు, టీచర్లను మోసం చేశాయి కాబట్టే కాంగ్రెస్, బీఆర్ఎస్లు పూర్తి స్థానాల్లో అభ్యర్థులను నిలిపే సాహసం చేయలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు వస్తే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదన్నారు.
Similar News
News February 24, 2025
హార్దిక్ పాండ్య వాచ్ ధర ఎంతో తెలుసా?

పాక్తో మ్యాచులో టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ధరించిన చేతి గడియారం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్ ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది. రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందిన ఈ వాచ్ రిటైల్ ధర ₹1.50కోట్లకు పైగా ఉంటుంది. రఫెల్ నాదల్, విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో వంటి క్రీడాకారులతో పాటు సినీ హీరో రామ్ చరణ్ ఈ గడియారాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం.
News February 24, 2025
అలారం పెట్టుకొని నిద్ర లేస్తున్నారా?

అలారం పెట్టుకొని నిద్ర నుంచి ఉలిక్కిపడి లేవడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడైంది. ఇది హార్ట్ బీట్పై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. దీంతో శ్వాస ఆడకపోవడం, ఆందోళన, తలనొప్పి రావొచ్చని పేర్కొంది. వీలైతే న్యాచురల్గా నిద్ర లేవడం, అలారం సౌండ్ తక్కువగా పెట్టుకోవడం చేయాలని సూచించింది.
News February 24, 2025
ఆపరేషన్ SLBC: రెండు ప్లాన్లు సిద్ధం చేసిన అధికారులు

TG: శనివారం ఉదయం SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ఇంకా బయటికి రాలేదు. వారిని తీసుకొచ్చేందుకు NDRF, నేవీ ప్రయత్నిస్తున్నాయి. అయితే బురద వల్ల లోనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్లాన్-ఎ, ప్లాన్-బి రూపొందించాయి. సొరంగానికి సమాంతరంగా మరొకటి తవ్వడం, పైనుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్లడం. ఈ రెండింటిపై కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు ఆ 8మంది సురక్షితంగా బయటికి రావాలని అంతా కోరుకుంటున్నారు.