News February 23, 2025
WNP: ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు: కలెక్టర్

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. జిల్లాలో 12 ఇసుక రీచ్లు ఉన్నాయని అన్నారు. జిల్లాలో ఇసుక అవసరం ఉన్న వారు మన ఇసుక వాహనం ద్వారానే తీసుకోవాలని దళారులను ఎవరూ ఆశ్రయించొద్దని సూచించారు. ఇసుకకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఐడీఓసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం 08545-233525కు కాల్ చేసి తెలపాలని అన్నారు.
Similar News
News January 16, 2026
ఖమ్మం: సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి

ఖమ్మం జిల్లాలో జనవరి 18న జరగనున్న సీఎం రేవంత్రెడ్డి పర్యటనను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు నిబంధనల ప్రకారం చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పి.శ్రీజ అధికారులను శుక్రవారం ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్తో కలిసి నిర్వహించిన సమీక్షలో హెలిప్యాడ్, భద్రత, కాన్వాయ్ వాహనాలు, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక ఏర్పాట్లు ప్రోటోకాల్ మేరకు ఉండాలని సూచించారు.
News January 16, 2026
ప్రాధాన్యం సంతరించుకున్న మోదీ WB టూర్

PMమోదీ రేపు, ఎల్లుండి WBలో చేపట్టనున్న పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. APRలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ₹3,250CR ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఇతర రాష్ట్రాలకు 7 అమృత్ భారత్ రైళ్లను, తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ను ప్రారంభిస్తారు. సింగూర్లో ₹830CR అభివృద్ధి పనులకు శ్రీకారం, బాలాగఢ్లో 900 ఎకరాల్లో కార్గో హ్యాండ్లింగ్ టెర్మినల్కు శంకుస్థాపన చేస్తారు.
News January 16, 2026
విశాఖలో భూ లిటిగేషన్లతో తలపోటు (1/2)

విశాఖలో భూ లిటిగేషన్లు మరోసారి తలపోటుగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భూములపై అక్రమార్కులు తిష్ట వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో వివాదాలు తెరపైకి రావడం యంత్రాంగానికి సవాల్గా మారింది. శివారు ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరగడంతో యాజమాన్య హక్కులపై సవాళ్లు పెరుగుతున్నాయి.


