News February 23, 2025
నర్సీపట్నం: బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీసు అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల ఏర్పాటుపై ఆదివారం శాసనసభ ప్రాంగణంలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న క్యాంటీన్ పనులను పరిశీలించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
Similar News
News February 24, 2025
ఆనందంగా ఉంది: కోహ్లీ

కీలక మ్యాచ్లో సెంచరీ చేయడం ఆనందంగా ఉందని పాక్తో గేమ్ అనంతరం విరాట్ కోహ్లీ తెలిపారు. నా శక్తిని, ఆలోచనలను పూర్తిగా అదుపులో ఉంచుకొని ఎక్కువసేపు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రోహిత్ త్వరగా ఔటైనా తాను ఎక్కువ రన్స్ చేయడం సంతృప్తినిచ్చినట్లు వెల్లడించారు. షాహీన్ బౌలింగ్లో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని, అందుకే అతడిని వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్గా పిలుస్తారని కోహ్లీ కితాబిచ్చారు.
News February 24, 2025
సంగారెడ్డి: 1.08 కోట్ల రుద్రాక్షలు.. 18.06 అడుగుల శివలింగం

సంగారెడ్డి మండలం ఫసల్వాది సమీపంలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో 1.08 కోట్ల రుద్రాక్షలతో తయారు చేసిన 18.06 అడుగుల శివలింగాన్ని ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రత్యేక పూజలు చేసి కోటి రుద్రాక్ష శివలింగాన్ని ఆవిష్కరించారు. 26న మహాశివరాత్రి సందర్భంగా కోటి రుద్రాక్ష శివలింగానికి అభిషేకం చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
News February 24, 2025
నర్సింహులపేట: జ్యోతిష్యం పేరుతో మోసం!

జ్యోతిష్యం పేరుతో బాబా వేషంలో వచ్చిన వ్యక్తులు బంగారం కాజేసిన ఘటన పెద్ద వంగర మండలం ఉప్పరగూడెంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన సముద్రాల శోభ ఇంటికి ఇద్దరు బాబా వేషాధరణలో వచ్చిన వ్యక్తులు, మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా అంటూ మాటలు కలుపుతూ శోభపై మొత్తం ముందు చల్లారు. శోభ ధరించిన బంగారాన్ని కాజేశారు. ఫోటో ఆధారంగా శోభ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.