News February 23, 2025
నంద్యాల జిల్లా నేటి ముఖ్యాంశాలు

☞ శ్రీశైలానికి ఎంపీ శబరి పాదయాత్ర
☞ గడివేముల మండలంలో పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
☞ నెల్లూరు జిల్లాలో మంత్రి బీసీ పర్యటన
☞నంద్యాలలో ర్యాలీని జయప్రదం చేయండి: బొజ్జా
☞ చెంచు మహిళలకు కుట్టు మెషీన్లు పంపిణీ
☞ శ్రీశైలంలో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం
☞ ప్రొద్దుటూరులో ట్రాక్టర్ బోల్తా.. ఆళ్లగడ్డ డ్రైవర్ మృతి
☞ ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు: కర్నూలు కలెక్టర్
Similar News
News November 9, 2025
ఈనెల 11న ములుగులో ‘ఐక్యత పాదయాత్ర’

‘ఏక్ భారత్ – ఆత్మ నిర్భర భారత్’ నినాదంతో ఈ నెల 11న ఉదయం ములుగులో జిల్లా స్థాయి ఐక్యత పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. యువతలో దేశభక్తి, ప్రజల్లో సమైక్యతను పెంచేందుకు ఈ యాత్రను చేపట్టారు. ఉదయం 9:30 గంటలకు ఫారెస్ట్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు జరిగే ఈ పాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
News November 9, 2025
వేములపల్లిలో ఉరేసుకుని వివాహిత మృతి

ఉరివేసుకుని వివాహిత మృతి చెందిన ఘటన ఆదివారం ద్వారపూడి శివారు వేములపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. ముమ్మిడివరం (m) సోమదేవరపాలెంకు చెందిన మట్టా రేఖ (24) వేములపల్లిలో పాకలో ఉరివేసుకుని మృతి చెందింది. వేములపల్లిలో తండ్రి ఇంటికి 4నెలల క్రితం కాన్పుకోసం వచ్చింది. ఫోన్లో ఆమె భర్త వేణుతో గొడవ పడినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.
News November 9, 2025
పేకాట శిబిరంపై దాడి.. రూ.68,920 సీజ్: సీఐ

కురుపాం మండలం సింగుపురం సమీపంలో పేకాట శిబిరంపై సీఐ బి.హరి ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకొని వారి వద్ద ఉన్న రూ.68,920 సీజ్ చేశామని సీఐ తెలిపారు. పట్టుబడినవారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఎస్సైలు నారాయణరావు, శివప్రసాద్, పోలీస్ సిబ్బంది


