News February 24, 2025
శుభ ముహూర్తం(సోమవారం, 24-02-2025)

☛ తిథి: బహుళ ఏకాదశి, ఉ.10.44 వరకు
☛ నక్షత్రం: పూర్వాషాడ, సా.4.44 వరకు
☛ శుభ సమయాలు: ఉ.5.55-ఉ.6.31 వరకు
☛ రాహుకాలం: ఉ.7.30 నుంచి సా.9.00 వరకు
☛ యమగండం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
☛ దుర్ముహూర్తం: మ.12.24- మ.1.12 వరకు, మ.2.46 నుంచి 3.34 వరకు
☛ వర్జ్యం: రా.12.51 నుంచి 2.28 వరకు
☛ అమృత ఘడియలు: ఉ.11.44-1.23 వరకు
Similar News
News February 24, 2025
రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి

AP: ఏపీజెన్కో గతంలో ఎన్నడూ లేనంతగా నిన్న 241.523 మిలియన్ యూనిట్ల(MU) విద్యుత్ ఉత్పత్తి చేసింది. విజయవాడ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం(VTPS) స్థాపించిన తర్వాత నిన్న సాధించిన 52.73MU విద్యుత్ ఉత్పత్తే అధికం. ఇతర థర్మల్ కేంద్రాల్లో 123.055MU, హైడల్ 9.411MU, తదితరాల ద్వారా మిగతా విద్యుత్ జనరేట్ అయింది. ఏపీజెన్కో చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం అని సంస్థ MD కేవీఎస్ చక్రధరబాబు తెలిపారు.
News February 24, 2025
రానున్న 3 రోజులు జాగ్రత్త

AP: వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ ప్రభావం కన్పిస్తోంది. ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.5°C నమోదైంది. రానున్న రెండు, మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లోనూ వేడి వాతావరణం ఉంటుందని, అందుకు తగ్గట్టు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News February 24, 2025
MLC ఎన్నికలు.. ఇవాళ సీఎం రేవంత్ ప్రచారం

TG: ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న CM రేవంత్ రెడ్డి ఇవాళ 3 జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. NZB, ADB, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో INC తరఫున నరేందర్ బరిలో ఉన్నారు. దీంతో ఆయన తరఫున రేవంత్ ఉదయం 11.30 గంటలకు HYD నుంచి NZB చేరుకొని ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మ. 2 గంటలకు మంచిర్యాలలో, సాయంత్రం 4 గంటలకు కరీంనగర్లో పట్టభద్రుల ఓట్లు అభ్యర్థిస్తారు.