News February 24, 2025
ప్రశాంతంగా టీజీ సెట్- 2025 ప్రవేశ పరీక్ష

ఆదివారం నిర్వహించిన టీజీ సెట్- 2025 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఆదివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి బైపాస్ వద్ద ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో నిర్వహించిన టీజీ సెట్ ప్రవేశ పరీక్షను తనిఖీ చేశారు. ప్రవేశ పరీక్షకు మొత్తం 12,929 మంది విద్యార్థులను కేటాయించగా, పరీక్షకు 12,503 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Similar News
News February 24, 2025
NLG జిల్లాలో అంగన్వాడీ పోస్టుల వివరాలు

అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో మహిళల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14,236 పోస్టుల భర్తీకి నిర్ణయించింది. NLG జిల్లాలో సుమారు 223 అంగన్వాడీ టీచర్, 63 హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ల కొరత కారణంగా ఒక్కొక్కరికి రెండు సెంటర్ల బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయనుండడంతో టీచర్ల కొరత తీరనుంది.
News February 23, 2025
NLG: నేడు గురుకుల ప్రవేశ పరీక్ష

SC, ST, BC, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో, SC, ST గురుకులాల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆదివారం ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష కోసం NLGలో 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు 12,929 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మైనార్టీ గురుకులానికి సంబందించి ఇంటర్మీడియట్లో చేరేందుకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఇందు కోసం 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News February 23, 2025
నల్గొండ: వణికిస్తున్న బర్డ్ ఫ్లూ

NLG, యాదాద్రి జిల్లాలో బర్డ్ ఫ్లూ మాంసప్రియులను వణికిస్తోంది. ఆదివారం వచ్చిందంటే చాలు కచ్చితంగా చికెన్ కావాలనే పరిస్థితి నుంచి కోడిమాంసం తెచ్చుకోవాలంటే జంకే స్థితికి ప్రజలు వచ్చారు. బాయిలర్ కోళ్లతోపాటు ఫారం కోళ్లు, నాటుకోళ్లు కూడా చనిపోతున్నాయి. నిడమనూరు మండలంలో నాటు కోళ్లు మృత్యువాత పడ్డాయి. CPL మండలం నేలపట్లలో బర్డ్ ఫ్లూ కేసు నమోదైన సంగతి తెలిసిందే.