News February 24, 2025
ఢిల్లీని మించిన HYD.. జనాభాలో తగ్గేదేలే!

తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రాష్ట్ర జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 312 కాగా, హైదరాబాద్ జిల్లాలో ఇది 18,161కు చేరింది. ఇది దేశ రాజధాని ఢిల్లీ (11,313) కంటే ఎక్కువ. హైదరాబాద్ జిల్లా జనాభా సుమారు 39.43 లక్షలు. నగరంలో గ్రామీణ ప్రాంతాలు లేకపోవడంతో ఇది పూర్తిగా శహరీకృతమైంది. జనాభా పెరుగుదలతో మౌలిక వసతుల అభివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది.
Similar News
News February 24, 2025
ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ విద్య

TGలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా నేటి నుంచి ఆరు జిల్లాల్లోని 36 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఆయా స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేసి ఏఐ లెర్నింగ్ టూల్స్ ద్వారా విద్యార్థుల్లో లోపాలను గుర్తించనున్నారు. దీంతో వారికి టీచర్లు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.
News February 24, 2025
HYD: పదో తరగతి చదువుతున్నారా..? మీకోసమే!

పదో తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి డిప్లొమా పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందుకోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచే విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు.
News February 24, 2025
HYD: పదో తరగతి చదువుతున్నారా..? మీకోసమే!

పదో తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి డిప్లొమా పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందుకోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచే విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు.