News February 24, 2025
MNCLజిల్లాలో 58 పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్

మంచిర్యాల జిల్లాలో ఈ నెల 27న జరగనున్న పట్టభద్రులు, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 40, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.
Similar News
News February 24, 2025
తిరుమల భక్తులకు అలర్ట్

తిరుమల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్లో రిలీజ్ చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి గదుల కోటా టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తేనుంది.
వెబ్సైట్: <
News February 24, 2025
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదం.. 13 ఏళ్ల బాలుడు మృతి

చిలకలూరిపేట మండల పరిధిలోని గోపాళంవారిపాలెం పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ్ (13) అనే యువకుడు దుర్మరణం చెందాడు. గోపాళంవారిపాలెంకు చెందిన ముగ్గురు పిల్లలు పల్సర్ బైక్ పై వెళుతున్నారు. ఆర్టీసీ బస్ను క్రాస్ చేస్తూ, ఎదురుగా వస్తున్న ఎక్సల్ వాహనంను ఢీకొట్టారు. ప్రమాదంలో విజయ్ అక్కడికక్కడే చనిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 24, 2025
ఆపరేషన్ SLBC: రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్

TG: SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్స్ మైనర్స్ను రంగంలోకి దించింది. నిన్న ఢిల్లీ నుంచి HYDకు చేరుకున్న ఆరుగురు మైనర్లు కాసేపట్లో టన్నెల్ వద్దకు చేరుకోనున్నారు. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41మంది కార్మికులు చిక్కుకోగా 17రోజులు ప్రయత్నించినా అధికారులు బయటికి తీసుకురాలేకపోయారు. చివరికి ఈ ర్యాట్ హోల్ మైనర్లు ఒక్కరోజులోనే వారిని సురక్షితంగా తీసుకొచ్చారు.