News February 24, 2025

ఉప్పల్: పదవ తరగతి చదువుతున్నారా..? మీకోసమే!

image

పదవ తరగతి పూర్తయ్యాక డైరెక్ట్ ఇంజనీరింగ్ విద్యను డిప్లమా లెవెల్లో అభ్యసించడం కోసం పాలిటెక్నిక్ విద్య అందుబాటులో ఉంది. ఇందు కోసం పాలీసెట్ ప్రవేశ పరీక్ష మే 16వ తేదీన జరుగుతుందని రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు తెలిపారు. ఇందుకు ఇప్పటి నుంచి విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయన్నారు. 

Similar News

News February 24, 2025

నెల్లూరు: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

image

భార్య పుట్టింటికి వెళ్లిందన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు నగరం కపాడిపాలెంలో చోటుచేసుకుంది. కపాడిపాలెంకు చెందిన శ్రావణ్ కారు డ్రైవర్‌గా భార్య సుమాంజలి నర్స్‌గా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. ఇటీవల వారి మధ్య చిన్నపాటి గొడవ జరగ్గా భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాప చెందిన శ్రావణ్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News February 24, 2025

సిద్దిపేట: నిప్పంటించుకుని ఇద్దరు సూసైడ్

image

సిద్దిపేట జిల్లాలో <<15557045>>నిప్పంటించుకుని<<>> ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డిన విషయం తెలిసిందే. వివరాలు.. ఈ ఘటనలో మహిళ అక్కడే మృతి చెందగా, పురుషుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి ఆధార్ కార్డ్‌ల ద్వారా సిద్దిపేటకు చెందిన లక్ష్మి(65), భర్త పేరు చందుగా, రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్‌కు చెందిన శ్రీధర్(44), తండ్రి నర్సోజిగా పురుషుడి వివరాలు ఉన్నాయి. వీరిని గుర్తు పట్టిన వారు తొగుట పోలీసులను సంప్రదించాలని కోరారు.

News February 24, 2025

HYD: పిల్లలపై పెరుగుతున్న అఘాయిత్యాలు..!

image

గ్రేటర్ HYD పరిధిలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. POCSO చట్టం కింద నమోదైన కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. 2022- 426, 2023- 559, 2024- 713 కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదలపై పోలీసులు, సామాజిక సంస్థలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో జరుగుతున్న క్రైమ్స్ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!