News February 24, 2025

సిర్పూర్ టీ: భీమన్న గుడి వద్ద మృతదేహం

image

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమన్న దేవాలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని సిర్పూర్ పోలీసులకు అందించారు. అయితే సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Similar News

News February 24, 2025

చొప్పదండి: కారు ఢీకొని యువకుడి మృతి

image

చొప్పదండి పట్టణంలోని ఉడిపి హోటల్ సమీపంలో ఆదివారం రాత్రి కారు ఢీకొని ఒడ్నాల రమేష్ ( 22) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ గొల్లపల్లి అనూష తెలిపారు. చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన రమేష్ అవివాహితుడు. పట్టణంలోని హోటల్లలో పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. మృతుని తండ్రి గతంలోనే మరణించగా తల్లి కరీంనగర్లో కూలీ పని చేస్తూ జీవిస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News February 24, 2025

నేడు మహబూబాబాద్‌లో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత

image

మహబూబాబాద్‌లో నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. ఉదయం 9:30గం.కు డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లిలో నెట్ సెంటర్ ప్రారంభిస్తారు. 10:00 గం.కు మరిపెడలోని జాగృతి నాయకురాలు మాధవి గృహప్రవేశంలో పాల్గొని, 11:00 గం.కు కురవి వీరభద్రస్వామి ఆలయంలో పూజ చేస్తారు. మ.12:00 గంటలకు మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొంటారు.

News February 24, 2025

KNR: నేడు ప్రజావాణి రద్దు: జిల్లా కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నేడు నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు, గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఫిర్యాదులు చేయాలనుకునే వారు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తియిన తర్వాత రావాలని తెలిపారు.

error: Content is protected !!