News February 24, 2025
కుబీర్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. భైంసా మండలం మిర్జాపూర్ సమీపంలో ఈ నెల 16న రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కుబీర్కు చెందిన సిందే సంతోష్ తలకు తీవ్రంగా గాయమైంది. కాగా నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంతోష్ ఆదివారం మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 15, 2025
బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం: HYD కలెక్టర్

వరద కారణంగా మృతిచెందిన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తామని కలెక్టర్ హరిచందన వెల్లడించారు. బాడీ దొరికిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాత ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వరద ఉద్ధృతి పెరిగే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని నాళాలపై నిర్మాణాలు జరుగుతుండటంతో ప్రమాదాలు తలెత్తుతున్నాయని, అలాంటి నిర్మాణాలపై చర్యలు తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు.
News September 15, 2025
సంగారెడ్డి: ఐటీఐల్లో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తు గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు ఐటీఐ కన్వీనర్ తిరుపతి రెడ్డి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు http://iti.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇది చివరి అవకాశమని, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 15, 2025
ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా సేవాలాల్ నాయక్

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా సేవాలాల్ నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై ఉంచిన విశ్వాసాన్ని నిబద్ధతతో, మరింత బాధ్యతతో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. ఈ పదవిని తనకు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఉమేష్ జాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఇతర జిల్లాల అధ్యక్షులు, సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.