News February 24, 2025
అధైర్య పడొద్దు.. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం: ఎమ్మెల్యే బొజ్జు

ఉట్నూర్ మండలం లక్షటిపేటకు చెందిన ఉప్పు నర్సయ్య ఇండ్లు ప్రమాదవశాత్తు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యి సర్వం కోల్పోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదివారం బాధిత కుటుంబానికి పరామర్శించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నర్సయ్య కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఆధైర్యపడవద్దని త్వరలో ఇందిరమ్మ ఇళ్ల ఇస్తామన్నారు.
Similar News
News January 13, 2026
ఆదిలాబాద్: రూ.90 పెరిగిన పత్తి ధర

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,710గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ.90 పెరిగినట్లు వెల్లడించారు.
News January 12, 2026
ADB: రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా జమునా నాయక్

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని దానోరా (బి) సర్పంచ్ జాదవ్ జమునా నాయక్ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సర్పంచుల సంఘం బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. క్రమశిక్షణతో పాటు రాష్ట్ర అభివృద్ధికై తోడ్పాటు చేస్తానని జమునా నాయక్ పేర్కొన్నారు.
News January 12, 2026
ఆదిలాబాద్: 19న కలెక్టరేట్ ఎదుట ధర్నా

ఈ నెల 19వ తేదీన ఆదిలాబాద్లోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ సభ్యుడు జాదవ్ సోమేశ్ తెలిపారు. నిరుద్యోగుల కోసం 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే డిమాండుతో నిరసన చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలోని నిరుద్యోగ యువత హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.


