News February 24, 2025

రానున్న 3 రోజులు జాగ్రత్త

image

AP: వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ ప్రభావం కన్పిస్తోంది. ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.5°C నమోదైంది. రానున్న రెండు, మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లోనూ వేడి వాతావరణం ఉంటుందని, అందుకు తగ్గట్టు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Similar News

News February 24, 2025

జగన్ అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారు: అచ్చెన్నాయుడు

image

AP: జగన్, YCP MLAలు అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చారని, ప్రజల కోసం కాదని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందని, ఉపఎన్నికలు వస్తే 11సీట్లు కూడా రావనే భయంతో వచ్చారన్నారు. అవినీతి నుంచి పుట్టిన పార్టీ YCP అని మండిపడ్డారు. ఓ పేపర్, టీవీని అడ్డం పెట్టుకొని చెప్పిన అబద్ధాలే చెప్పి చెప్పి నమ్మించాలని చూస్తే ఏమయిందో మొన్నటి ఎన్నికల్లో చూశామన్నారు.

News February 24, 2025

‘దసరా’తో గేర్ ఛేంజ్.. ‘హిట్3’తో బ్లడ్ బాత్

image

ఫీల్ గుడ్ మూవీస్‌తో ఆకట్టుకున్న న్యాచురల్ స్టార్ నాని గేర్ మార్చారు. దసరాతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా ‘సరిపోదా శనివారం’తో యాక్షన్‌కు పెద్ద పీట వేశారు. తాజాగా రిలీజైన ‘హిట్3’ <<15561948>>టీజర్‌లో<<>> నాని ఊచ కోత మామూలుగా లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యాంగ్రీ పోలీస్ రోల్‌లో రక్తపాతం సృష్టించారని చెబుతున్నారు. దీంతో తర్వాత రాబోయే ‘ది ప్యారడైజ్’ ఎలా ఉంటుందో అని చర్చించుకుంటున్నారు.

News February 24, 2025

క్షణ క్షణం తీవ్ర ఉత్కంఠ.. ఏం జరుగుతోంది?

image

TG: SLBC టన్నెల్‌లో ప్రమాదం జరిగి రెండు రోజులు గడిచినా ఘటనా స్థలికి రెస్క్యూ బృందాలు చేరుకోలేకపోతున్నాయి. 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, బురద, నీటి లీకేజీ కారణంగా తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 8 మంది కార్మికులు ప్రాణాలతో ఉన్నారా? లేదా? అనే ఆందోళన నెలకొంది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు సీఎం రేవంత్, మంత్రులు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు.

error: Content is protected !!