News February 24, 2025
పార్వతీపురం జిల్లాలో 17,849 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు

పార్వతీపురం జిల్లాలో 17,849 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని DVEO మంజుల వీణ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 1 నుంచి జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 500 మంది ఇన్విజిలేటర్లు, 34 మంది పర్యవేక్షకులు, ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్తో పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News February 24, 2025
మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: అచ్చెన్న

ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా టెక్కలి ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులకు సోమవారం చరవాణిలో మాట్లాడారు. దర్శనానికి వివిధ ప్రాంతాలు నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అలాగే ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News February 24, 2025
ప్రియుడి కోసం విషం తాగిన యువతులు

AP: విషం తాగి బతికినవాళ్లు ప్రియుడితో ఉండాలని ఇద్దరు అమ్మాయిలు పోటీపడిన ఘటన అనంత(D)లో జరిగింది. దివాకర్, రేష్మ, శారద ఒకే కాలేజీలో చదివారు. దివాకర్ను లవ్ చేసిన రేష్మకు మరొకరితో పెళ్లైంది. ఆ తర్వాత శారదను దివాకర్ లవ్ చేశాడు. ఇటీవల రేష్మ భర్తను వదిలేసి ప్రియుడి వద్దకొచ్చింది. రేష్మ, శారద ఫ్రెండ్స్ కావడంతో మాటల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపడింది. ప్రస్తుతం శారద చనిపోగా, రేష్మ ఆస్పత్రిలో ఉంది.
News February 24, 2025
సౌరశక్తిలో భారత్ సూపర్ పవర్: ప్రధాని మోదీ

ఆర్థిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా IND కొనసాగుతోందని వరల్డ్ బ్యాంక్ కొనియాడిందని PM మోదీ వెల్లడించారు. సౌరశక్తిలోనూ ఇండియా సూపర్ పవర్గా మారిందని UN ప్రశంసించిందన్నారు. MPలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో PM ప్రసంగించారు. ఇతర దేశాలు మాటలకే పరిమితమైతే భారత్ చేసి చూపిందని చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తే ఎకానమీ గ్రోత్, ఉద్యోగాల కల్పనకు దారి ఏర్పడుతుందన్నారు.