News February 24, 2025
ముదినేపల్లి కాలేజీ ప్రిన్సిపల్ సస్పెండ్

ఏలూరు జిల్లాలో ఓ ప్రిన్సిపల్పై వేటు పడింది. ముదినేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ జాస్మిన్పై పలు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీలో జనవరి 4న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఆ రోజు ఆమె వ్యవహరించిన తీరుపై కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారి సాల్మన్ రాజు విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ మేరకు ఆమెను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ శారద ఉత్తర్వులిచ్చారు.
Similar News
News September 17, 2025
సూర్యాపేట-గరిడేపల్లి హైవేపై యాక్సిడెంట్

గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం ఫతేపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ టీవీఎస్ ఎక్సెల్పై ప్రయాణిస్తుండగా సూర్యాపేట-గరిడేపల్లి రహదారిపై లారీ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 17, 2025
ఏడాదికి రూ.50వేల స్కాలర్షిప్.. APPLY

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో AICTE ప్రగతి స్కాలర్షిప్లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31 వరకు <
News September 17, 2025
HYD: ప్రపంచాన్ని ఆకర్షించేలా మూసీని మారుస్తాం: సీఎం

మూసీని శుద్ధి చేసి HYDను సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాపాలన వేడుకల్లో మాట్లాడుతూ.. మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని, మూసీని శుద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామన్నారు.