News February 24, 2025

MTM: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెరపైకి వైసీపీ

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటి వరకు తాము పోటీలో ఉండమని చెప్పి వైసీపీ అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల తెరపైకి వచ్చింది. పార్టీపరంగా అభ్యర్థిని నిలబెట్టకపోయినా PDF అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాజా మాజీ MLC KS లక్ష్మణరావుకు మద్దతు ప్రకటించింది. దీంతో ఈ ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. కూటమి అభ్యర్థి ఓటమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది.

Similar News

News April 22, 2025

కృష్ణా : ‘కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం తగదు’

image

కోర్టు కేసులకు సంబంధించి వకాలత్, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమానికి ముందుగా జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు.

News April 21, 2025

కృష్ణా: ట్రై సైకిల్ పంపిణీ చేసిన కలెక్టర్

image

సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు.

News April 21, 2025

కృష్ణా: 131 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేత

image

జిల్లాలో 131 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు సైకిళ్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందించారు. మెడికల్ క్యాంప్‌ల ద్వారా గుర్తించిన వీరికి రూ.15లక్షలు విలువ చేసే ట్రై సైకిల్స్, ఇతర ఉపకరణాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరితోపాటు పాఠశాలల్లో సమానంగా చదువుకోవడానికి ఈ ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

error: Content is protected !!