News February 24, 2025
ఖమ్మం: పోక్సో కేసు నిందితుడు అరెస్ట్:సీఐ

రఘునాథపాలెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. నాలుగు రోజులు కిందట నమోదైన పోక్సో కేసులో ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టిగూడెంకు చెందిన వంశీని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Similar News
News February 24, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజులు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వరుసగా మూడు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈనెల 26, 27న మహాశివరాత్రి సందర్భంగా సెలవు, 28న అమావాస్య సందర్భంగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. మార్చి 1న శనివారం మార్కెట్లో మిర్చి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని ప్రకటించారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించి సహకరించాలని కోరారు.
News February 24, 2025
డిప్యూటీ సీఎం పీఏ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీఏ శ్రీనివాస్ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు. ఐసీడీఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అయిన ఆయన భట్టి దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై డిప్యూటీ భట్టి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
News February 24, 2025
గుడ్ న్యూస్.. రేపు ఖమ్మంలో జాబ్ మేళా

ఖమ్మం SR&BGNR డిగ్రీ కళాశాలలో ప్లేస్ మెంట్ సెల్, తెలంగాణ స్కిల్స్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.మహ్మద్ జాకిరుల్లా తెలిపారు. టెక్ మహీంద్రా, జెన్ ప్యాక్ట్, ముత్తూట్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, క్యూస్ కారప్స్ లిమిటెడ్, హెల్త్ కేర్ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.