News February 24, 2025

NZBలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

image

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.45 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ 1.30 వరకు మీటింగ్‌లో పాల్గొని మంచిర్యాల బయలుదేరి వెళ్తారు. అక్కడి నుంచి 4.20కి కరీంనగర్ చేరుకుని అక్కడ మీటింగ్‌లో పాల్గొని సాయంత్రం 6.45కు బేగంపేట తిరిగి వెళ్లిపోతారు.

Similar News

News November 9, 2025

వృత్తి విద్యతో ఉపాధి అవకాశాలు: అదనపు కలెక్టర్

image

హనుమకొండ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. ఈ మేళాలో 24 కంపెనీలు పాల్గొనగా 682 మంది యువతీ యువకులు నమోదు చేసుకున్నారు. వీరిలో 214 మందికి ఉద్యోగాలు దక్కాయి. వృత్తి విద్యతో నైపుణ్యాలు పెంపొందించుకొని ఉపాధి పొందాలని అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి సూచించారు.

News November 9, 2025

ఇతిహాసాలు – 61 సమాధానం

image

ప్రశ్న: యాదవ వంశం నశించాలని కృష్ణుడిని శపించింది ఎవరు? అలా శపించడానికి కారణాలేంటి?
జవాబు: కురుక్షేత్రంలో తన 100 మంది కుమారులు మరణించడంతో ఆ బాధ, కోపంతో శ్రీకృష్ణుడి యాదవ వంశం అంతమవ్వాలని గాంధారీ శపించింది. యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నా ఆయన పాండవుల విజయానికి పరోక్షంగా కారణమయ్యాడని నిందిస్తూ.. యాదవ వంశం కలహాలతో నశించిపోతుందని, కృష్ణుడు ఒంటరిగా చనిపోతాడని శపించింది. <<-se>>#Ithihasaluquiz<<>>

News November 9, 2025

వారంలో టెట్ నోటిఫికేషన్?

image

TG: టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫైల్ సీఎంకు చేరింది. ఏటా రెండు సార్లు టెట్​ నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్ కోసం అధికారులు ఫైల్​ సిద్ధం చేశారు. ప్రభుత్వ అనుమతి వస్తే వారంలో నోటిఫికేషన్​ వచ్చే అవకాశముంది. కాగా టీచర్లూ టెట్​ పాసవడం తప్పనిసరి అయిన నేపథ్యంలో వారికి అవకాశం కల్పించేందుకు అర్హత నిబంధనల జీవోను సవరించాల్సి ఉంది.