News February 24, 2025
ఉండవెల్లి: ఉరేసుకుని యువకుడి సూసైడ్

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు.. ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ మద్యానికి బానిసై చదువు ఆపేశాడు. రోజు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం కోసం తల్లి జయమ్మను డబ్బులు అడగగా ఆమె మందలించింది. కోపోద్రిక్తుడైన అనిల్కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News February 24, 2025
కామారెడ్డి: హామీల అమల్లో సీఎం మోసం: ఎంపీ

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశాడని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కామారెడ్డిలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు.
News February 24, 2025
పెద్దపల్లి: జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో సర్కారు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఆరోగ్య బీమా, రైల్వే పాస్, కొత్త అక్రిడిటేషన్ కార్డులు అందించాలని కోరారు. నిత్యం వివిధ రాజకీయ నాయకులు జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని, వారి కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని కోరారు.
News February 24, 2025
నల్గొండ: మహాశివరాత్రి.. మరో రెండు రోజులే!

శివరాత్రి వేడుకలు నల్గొండ జిల్లాలో ఘనంగా జరుగుతాయి. నల్గొండలోని ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం, బ్రహ్మంగారి గుట్టపై శివాలయం సహా పలు దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. చెరువుగట్టు రామలింగేశ్వర ఆలయం, దామరచర్ల మండలం వాడపల్లిలోని అగస్తేశ్వర స్వామి దేవాలయాలు జాగారం చేసే శివ భక్తులతో మారుమోగుతాయి. ఇంకా పలు మండలాల్లో శివరాత్రి సందర్భంగా ఎడ్ల పందేలు, క్రీడా పోటీలు నిర్వహిస్తారు.