News March 21, 2024
MBNR: కారు, బైక్ ఢీ.. కాంగ్రెస్ నేత మృతి

మహబూబ్నగర్ జిల్లా అడ్డకల్ మండల బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికుల సమాచారం.. బైపాస్ వద్ద రోడ్డు దాటుతున్న కాంగ్రెస్ నేత వెంకట్ రెడ్డి బైక్పై కారు ఢీకొట్టింది. ప్రమాదంలో వెంటక్ రెడ్డి తీవ్రంగా గాయడగా స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు చెప్పారు. వెంకట్ రెడ్డి మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 5, 2025
MBNR: ఓపెన్ SSC, INTER.. అప్లై చేసుకోండి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు ఈనెల 7తో (ఫైన్ లేకుండా) గడువు ముగుస్తుందని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 20లోగా ఫైన్తో అప్లై చేసుకోవచ్చని, ఆసక్తిగల విద్యార్థులు www.telanganaopenschool.org వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 5, 2025
HYD: బాహుబలి యాక్టర్కు కీర్తి పురస్కారం

తెలుగు వర్శిటీలో రంగస్థలం విభాగ గెస్ట్ ఫాకల్టీ, సినీ నటుడు, రంగస్థల దర్శకుడు డా.రాయల హరిశ్చంద్ర కీర్తి పురస్కార అవార్డు అందుకున్నారు. ఈ మేరకు నాటకరంగం విద్యార్థులు ఘనంగా సన్మానించి సత్కరించారు. దేశములోనే మేకప్, కాస్ట్యూమ్స్ అంశాలపై కేంద్రీయ విశ్వవిద్యాలయం(HYD) ద్వారా Ph.D చేసిన మొదటి వ్యక్తి. ఇతను బాహుబలి, విరూపాక్ష తదితర సినిమాల్లో నటించారు.VC నిత్యానందరావు, రిజిస్ట్రార్ హనుమంతరావు అభినందించారు.
News September 5, 2025
జడ్చర్ల: రోడ్డు ప్రమాదం.. UPDATE

జడ్చర్లలోని ఫ్లైఓవర్పై గురువారం కంటైనర్ను స్కార్పియో ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. SI జయప్రసాద్ వివరాల ప్రకారం.. కొంపల్లికి చెందిన రోహిత్తో పాటు మరో ఇద్దరు స్కార్పియోలో కొడైకెనాల్ నుంచి HYDకు వెళ్తుండగా వేగంగా కంటైనర్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రోహిత్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.