News February 24, 2025

పార్వతీపురం: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం

image

పార్వతీపురం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 2,333 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. అందులో పురుషులు 1574, మహిళలు 759 మంది. అత్యధికంగా పార్వతీపురంలో 636, సాలూరులో 250 మంది ఉన్నారు. అత్యల్పంగా పాచిపెంటలో 34 మంది ఉన్నారు. ఎన్నికల విధులు నిర్వహించేందుకు 18 మంది POలు, 18 APOలు, 36 OPOలు, 18 మంది ఎంఓలను నియమించినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News February 24, 2025

3 రోజుల పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీని ఎస్సీ, ఎస్టీ కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే ఆయనను విచారించాలని ఆదేశించింది. ఉదయం, సాయంత్రం మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. వంశీకి వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

News February 24, 2025

జగిత్యాల: యూరియా కోసం రైతుల ఇబ్బందులు

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంటకు చివరి దశలో యూరియా చల్లడానికి రైతులకు బస్తాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అరకొరగా వస్తున్న యూరియా కోసం వందల సంఖ్యలో రైతులు సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద కాపలా కాస్తున్నారు. సోమవారం జగిత్యాల, మల్లాపూర్‌కు యూరియా రాగా రైతులు అధికసంఖ్యలో రావడంతో పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు.

News February 24, 2025

ఓటీటీలోకి కొత్త సినిమా

image

అజిత్, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విదాముయార్చి’(పట్టుదల) మార్చి 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్వీట్ చేసింది. మగిజ్ తిరుమేని తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి రానుంది.

error: Content is protected !!