News February 24, 2025
సిద్దిపేట: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వేర్వేరు ప్రమాదాల్లో డివైడర్ను ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వివరాలు.. చిన్నకోడూర్ మండలం మల్లారం గ్రామ శివారులో ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో బైక్పై ఉన్న ఛత్తీస్గఢ్కు రాష్ట్రానికి చెందిన ఉలేష్ కుమార్ (40) విష్ణు ఠాకూర్ (42) అక్కడికక్కడే మృతి చెందారు. కొండపాక మండలానికి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి(22) మండలంలోని సిర్సనగండ్ల శివారులో డివైడర్ను ఢీకొట్టడంతో మరణించాడు.
Similar News
News November 4, 2025
‘ది రాజాసాబ్’ విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మూవీ టీమ్ ఖండించింది. ముందుగా ప్రకటించినట్లుగానే సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
News November 4, 2025
మెదక్: మరి కాసేపట్లో భారీ వర్షం

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాబోయే 2 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని.. అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు.
News November 4, 2025
అనకాపల్లి: రేపు జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన

రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈనెల 5న అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు అనకాపల్లిలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షతన విద్యుత్ సర్కిల్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారన్నారు. 10.45 గంటలకు కే.కోటపాడు మండలం చౌడువాడలోను, మధ్యాహ్నం 2.15 గంటలకు కింతలిలో విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.


