News March 21, 2024
పవన్ కాపులకు ఏం చేశారు?: భరత్
AP: కాపులకు పవన్ కళ్యాణ్ ఏం చేశారని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. ‘కాకినాడ ఎంపీతో పాటు ఆ పార్లమెంటు నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ స్థానాల్లో కాపులకు సీట్లు ఇచ్చాం. పవన్ కళ్యాణ్ ఏం చేశారు? ఒక్క చంద్రబాబుకే న్యాయం చేశారు. రాజకీయాల్లో మెచ్యూరిటీ లేని నేత పవన్. చంద్రబాబు ఆయన్ను కరివేపాకులాగా తీసిపారేస్తారు’ అని సెటైర్లు వేశారు భరత్.
Similar News
News October 2, 2024
ఇరాన్ క్షిపణులను డిఫెండ్ చేయాలని బైడెన్ ఆదేశం
ఇజ్రాయెల్పై ఇరాన్ <<14246742>>దాడి<<>> నేపథ్యంలో అక్కడి పరిస్థితులను యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్ను రక్షించేందుకు సహాయం చేయాలని, ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకున్న క్షిపణులను కాల్చివేయాలని బైడెన్ US మిలిటరీని ఆదేశించారు. కాగా ప్రతీకార దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని ఇరాన్ ప్రకటించింది.
News October 2, 2024
కలల్ని రీప్లే చేసే పరికరం.. కనిపెట్టిన పరిశోధకులు
ఒక్కోసారి చాలా మంచి కల వస్తుంటుంది. మెలకువ వచ్చేస్తే అయ్యో చక్కటి కల డిస్టర్బ్ అయిందే అంటూ ఫీల్ అవుతుంటాం. ఇకపై అలా ఫీల్ కానక్కర్లేదు. మన మనసులో నడిచే కలను ఒడిసిపట్టి దాన్ని తిరిగి రీప్లే చేసే పరికరాన్ని బ్రెయిన్ ఇమేజింగ్, AI సాంకేతికతల సాయంతో జపాన్ పరిశోధకులు రూపొందించారు. పరిశోధనలో పాల్గొన్నవారు చెప్పిన కలలకు, పరికరం గుర్తించిన సమాచారానికి 60శాతం కచ్చితత్వం వచ్చిందని వారు తెలిపారు.
News October 2, 2024
దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్ మోగించిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని ఆ దేశ మిలిటరీ ప్రకటించింది. పౌరులు బాంబు షెల్టర్లకు దగ్గరగా ఉండాలని ఆదేశిస్తూ దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్లు మోగించింది. జెరూసలేం సహా ఇజ్రాయెల్ అంతటా ఈ సైరన్లు మోగించినట్లు పేర్కొంది. ఫోన్లు, TVల ద్వారా ప్రకటనలు జారీ చేసింది.