News February 24, 2025

బెల్లంపల్లి: 2 రోజులు మద్యం షాపులు బంద్

image

MLC ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో మద్యం విక్రయాలు నిలిపివేయనున్నట్లు బెల్లంపల్లి ఎక్సైజ్ CIఇంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ఈనెల 25వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Similar News

News February 24, 2025

ఎమ్మెల్సీ ఎన్నిక‌లపై విశాఖ కలెక్టర్ కసరత్తు 

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విధులు నిర్వ‌హించే సిబ్బందికి రెండో విడ‌త ర్యాండ‌మైజేష‌న్ ప్ర‌క్రియ సోమ‌వారం పూర్త‌య్యింది. విశాఖ జిల్లాలోని 13 పోలింగ్ కేంద్రాల‌కు గాను పీవో, ఏపీవో, ఓపీవోల‌ను కేటాయిస్తూ క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ నిర్ణ‌యం తీసుకున్నారు. క‌లెక్ట‌రేట్లోని ఎన్.ఐ.సి. కేంద్రం నుంచి ఆన్‌లైన్ ప్ర‌క్రియ ద్వారా 13 పీవోల‌ను, 13 ఏపీవోల‌ను, 26 మంది ఓపీవోలను కేటాయించారు.

News February 24, 2025

అనకాపల్లి జిల్లాలో రెండు రోజులు వైన్స్ బంద్ 

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అనకాపల్లి జిల్లాలో మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారి సుధీర్ తెలిపారు. సోమవారం ఆయన అనకాపల్లిలో మాట్లాడుతూ.. వచ్చేనెల మూడవ తేదీన(మార్చి 3) ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం షాపులను మూసివేస్తామన్నారు.

News February 24, 2025

రూ.18 లక్షల నగదు పట్టివేత: నిర్మల్ ఏఎస్పీ 

image

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.18 లక్షల నగదును పట్టుకున్నట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా వెల్లడించారు. సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించగా సరైనా ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.18 లక్షల నగదును పట్టుకొని సీజ్ చేశామన్నారు. అనంతరం సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.

error: Content is protected !!