News February 24, 2025
ఖజానా ఖాళీ..! డబ్బులు ఇల్లె..!!

దేశంలో ఇటీవల కొత్తగా ముఖ్యమంత్రులు అయిన వారంతా చెబుతున్న మాటలివి. పథకాలు అమలు చేద్దామన్నా, ఆర్థికపర నిర్ణయాలు తీసుకుందామన్నా ఖజానా ఖాళీ అయింది అని మొన్న తెలంగాణ సీఎం రేవంత్, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు, నేడు ఢిల్లీ సీఎం రేఖ అంటున్నారు. ఇందుకు చెప్పే కామన్ కారణం గత పాలకుల నిర్ణయాలు. రేపటి పాలకులు ఈ మాట చెప్పొద్దంటే కనీస అవసరాలు కాని ఉచితాలు ఆపేయడమే పరిష్కార మార్గం. నేతలు ఈ నిర్ణయం తీసుకోగలరా?
Similar News
News February 24, 2025
CHECK NOW.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా?

‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం నిధులను ప్రధాని మోదీ ఇవాళ విడుదల చేశారు. ఈ పథకం కింద ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున రూ.6వేలు జమ చేస్తారు. ఇవాళ దేశంలోని 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.22వేల కోట్లను జమ చేశారు. E-KYC పూర్తైన వారి అకౌంట్లలోనే డబ్బులు జమ అయ్యాయి. మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో ఇక్కడ <
News February 24, 2025
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలో ఊర్వశీ రౌతేలా?

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీపై ఓ టాక్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఊర్వశీ రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించగా ఓకే చెప్పినట్లు టాక్. నెక్స్ట్ షెడ్యూల్లో ఆమె షూటింగ్లో జాయిన్ అవుతారని సమాచారం. ఈ మూవీలో టొవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది.
News February 24, 2025
11 నిమిషాలు కూడా సభలో ఉండలేకపోయారా?: షర్మిల

AP: సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి సభలో 11 నిమిషాలు కూడా కూర్చోలేకపోయారా అని ఆమె విమర్శించారు. ‘జగన్కు ప్రజల శ్రేయస్సు కంటే పదవులే ముఖ్యం. ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా? చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలి. జనాలు ఛీ కొడుతున్నా జగన్ తీరు మాత్రం మారటం లేదు’ అని ఆమె ట్వీట్ చేశారు.