News February 24, 2025
PPM: ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లది కీలకపాత్ర

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు కీలకపాత్ర అని DRO కె.హేమలత స్పష్టం చేశారు. జవాబుదారీతనం కలిగి సాధారణ పరిశీలకుల నియంత్రణ, పర్యవేక్షణలో సూక్ష్మ పరిశీలకులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. సూక్ష్మ పరిశీలకులు గుర్తించిన అంశాలను సాధారణ పరిశీకులకి సీల్డ్ కవర్లో అందించాలని ఆమె పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Similar News
News February 24, 2025
విద్యుత్ షాక్తో నలుగురు మృతి

AP: గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం నెలకొంది. గోశాల వద్ద విద్యుత్ షాక్తో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఓ రైతుతో పాటు ముగ్గురు కూలీలు ఉన్నట్లు సమాచారం
News February 24, 2025
AP మిర్చికి కేంద్రం మద్దతు ధర

AP: మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద ఏపీ మిర్చికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటా మిర్చికి రూ.11,781 ధర ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ధర లేదంటూ ఏపీలో రైతులు ఆందోళన చేయగా, సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి దీనిపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేంద్రం మద్దతు ధరపై ఈ ప్రకటన చేసింది. తొలి క్వింటా మిర్చి సేకరణ నుంచి నెల రోజుల పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి.
News February 24, 2025
లింగాల మండలంలో దారుణ హత్య

లింగాల మండలంలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. దిగువపల్లి గ్రామంలో పప్పూరు గంగిరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం మధ్యాహ్నం దారుణంగా హత్య చేశారు. పొలం పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లిన గంగిరెడ్డిని వేట కొడవల్లతో నరికి హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.