News February 24, 2025
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచులో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో బంగ్లా విజయంపైనే పాకిస్థాన్ CT సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.
NZ: యంగ్, కాన్వే, విలియమ్సన్, రవీంద్ర, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్ వెల్, సాంట్నర్, హెన్రీ, జెమీసన్, ఓరౌర్కే.
BAN: హసన్, శాంటో, మిరాజ్, హృదయ్, ముష్ఫికర్, మహ్మదుల్లా, జాకర్, రిషద్, తస్కిన్, రాణా, రహ్మన్.
Similar News
News February 24, 2025
WFH.. ఇక ఉండదా?

కరోనా టైంలో ఎక్కువగా వినిపించిన పేరు వర్క్ ఫ్రం హోం(WFH). కొన్ని కీలక రంగాలు తప్ప చాలా మంది ఉద్యోగులు ఈ విధానంలో పనిచేశారు. ఇప్పుడు అంతా రివర్స్ అయ్యింది. చాలా కంపెనీలు WFH మోడ్ను ఎత్తివేస్తూ, ఉద్యోగులంతా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని స్పష్టం చేస్తున్నాయి. దీంతో దేశంలో WFH పూర్తిగా ఉండదా? హైబ్రిడ్ మోడల్ ఉద్యోగాలు ఉంటాయా? అనే చర్చ మొదలైంది. WFH ఉద్యోగాలపై మీ అభిప్రాయం ఏంటి?
News February 24, 2025
KCR, KTR ఎవరికి ఓటేస్తారు?: CM రేవంత్

TG: MLC ఎన్నికల్లో KCR, KTR, హరీశ్, కవిత సహా ఇతర BRS నేతలు ఎవరికి ఓటేస్తారని CM రేవంత్ ప్రశ్నించారు. కరీంనగర్లో మాట్లాడుతూ ‘ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని BRS నేతలు చెబుతున్నారు. వారు ఎవరిని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పాలి. ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామని అంటున్న వాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? కేసులకు భయపడి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు’ అని ఆరోపించారు.
News February 24, 2025
త్వరలో నెస్లే ఇండియా ఉత్పత్తుల ధరలు పెంపు

తమ ఉత్పత్తుల ధరలను స్వల్పంగా పెంచాలని Nestle India యోచిస్తోంది. కాఫీ, కోకో, వంట నూనెల ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ MD సురేశ్ నారాయణన్ తెలిపారు. ద్రవ్యోల్బణం, అధిక ఉత్పత్తి ధరల కారణంగా తమకు లాభాలు తగ్గాయని పేర్కొన్నారు. కేంద్రం వ్యక్తిగత ఆదాయ పన్నులను తగ్గించడంతో వినియోగదారుల వద్ద డబ్బులు మిగులుతాయని, దీంతో తమ ఉత్పత్తుల వినియోగం పెరిగే ఛాన్సుందని అంచనా వేశారు.