News February 24, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

image

పోలింగ్ ప్రక్రియపై పీఓలు, ఏపీఓలు పూర్తి అవగాహన కల్పించుకొని ఎన్నికల విధులను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని అనకాపల్లి జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ తెలిపారు. ఈ నెల 27న జిల్లాలో జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికలపై అధికారులకు రెండవ విడత శిక్షణ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్, మార్గదర్శకాలు సూచనలు తప్పక పాటించాలన్నారు.

Similar News

News February 24, 2025

విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ యుాజీసీ జేఆర్ఎఫ్ సాధించిన దివ్యాంగ ఏయూ విద్యార్థి 
➤ వాల్తేర్ డీఆర్ఎంగా లలిత్ బోహ్రా బాధ్యతలు స్వీకరణ
➤ అవమానంతో తన బిడ్డ చనిపోయాడంటూ గోపాలపట్నంలో నిరసన
➤ రుషికొండలో పల్సస్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగుల ఆందోళన
➤ ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫీజు గడువు పెంపు(మార్చి 13) 
➤ ఆనందపురం ఎస్ఐ ఎడమ చేతికి తీవ్ర గాయం
➤ విశాఖ ఆర్డీవోపై చర్యలకు జర్నలిస్టు సంఘాల డిమాండ్

News February 24, 2025

కుంభమేళా ఏర్పాట్ల అధ్యయనానికి UP వెళ్లిన AP బృందం

image

AP: 2027లో రాష్ట్రంలో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం కుంభమేళాలో రాష్ట్ర బృందం అధ్యయనం చేస్తోంది. మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి కమిషనర్ కేతన్ గార్గ్ సహా పలువురు కుంభమేళాను సందర్శించారు. ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ క్లియరెన్స్, భద్రతా చర్యల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల స్నాన ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.

News February 24, 2025

శ్రీశైలంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని, ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా పాతాళ గంగ ఘాట్‌కు చేరుకొని అక్కడ ఏర్పాట్లను భక్తులను అడిగి తెలుసుకున్నారు. పాతాళ గంగ వద్ద పుణ్య స్నానాలు ఆచరించే సమయంలో ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

error: Content is protected !!