News March 21, 2024

ఎన్నికల్లో వీరికి పోస్టల్ బ్యాలెట్లు

image

పోలింగ్ జరిగే మే 13న అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారికి ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. విద్యుత్, BSNL, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, AIR, స్టేట్ మిల్క్ యూనియన్, పాల సహకార సంఘాలు, హెల్త్, ఫుడ్ కార్పొరేషన్, RTC, అగ్నిమాపక, పోలీసులు, అంబులెన్స్, షిప్పింగ్, సమాచార, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, కవరేజీ కోసం లెటర్లు పొందిన జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంది.

Similar News

News April 23, 2025

కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత

image

కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంగళవారం కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఉదయం 9 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మరోవైపు భగ్గుమంటున్న ఎండల వేళ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

News April 23, 2025

నేడే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 40,776 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 23, 2025

ఉపాధి పనులపై కర్నూలు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

వేసవిలో ముమ్మరంగా ఉపాధి పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎంపీడీవోలను ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 90 శాతం లక్ష్యాన్ని సాధించేలా కృషి చేయాలని చెప్పారు. మంగళవారం ఉపాధి హామీ, హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయాల సేవల అంశాలపై జిల్లా అధికారులు, మండల స్పెషల్ అధికారులతో కలెక్టర్ ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

error: Content is protected !!