News February 24, 2025
పార్వతీపురం: ‘పీ-4 సర్వేని పక్కాగా చేపట్టాలి’

జిల్లాలో పీ-4 విధానంపై (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్ షిప్) సర్వేను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. మార్చి 8 నుంచి 28వ తేదీ వరకు సర్వే చేయాలని సూచించారు. జిల్లాలో 2,65,000 గృహాలు ఉన్నాయని, వ్యవధి తక్కువగా ఉన్నందున ప్రణాళికబద్దంగా సర్వే పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
Similar News
News January 25, 2026
ఓటు ప్రజల వజ్రాయుధం: కలెక్టర్

ఎనిమిది పదుల వయసులోనూ ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న రామకృష్ణారావు, సత్యనారాయణమూర్తి, కృష్ణంరాజు, శ్రీమన్నారాయణలను ఆదివారం ఏలూరులో కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ ఘనంగా సత్కరించారు. ఓటు ప్రజాస్వామ్య వజ్రాయుధమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
News January 25, 2026
వనపర్తి: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వనపర్తి కలెక్టరేట్ను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. సోమవారం ఉదయం 8:30కు కలెక్టరేట్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, 8 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సునీత రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం 9 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ప్రధాన వేడుకలు జరగనున్నాయి.
News January 25, 2026
VZM: ఇరువురి మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

రామభద్రపురం మండల పరిధి పాతరేగ గ్రామంలో ఇరువురు మధ్య జరిగిన చిన్న గొడవలో ఘర్షణ జరిగి ఒకరినొకరు కొట్టుకోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ ప్రసాదరావు వివరాల మేరకు.. యాసర్ల సింహాచలం (70) అదే గ్రామానికి చెందిన పెద్దింటి తిరుపతికి మధ్య పాతబాకీ డబ్బులు కోసం శనివారం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో తిరుపతి, సింహాచలాన్ని బలంగా తోసాడు.. అతడు కొళాయి దిమ్మపై పడడంతో మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు.


