News February 24, 2025
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన గవర్నర్

శ్రీశైలం మల్లన్న దర్శనార్థమై రాష్ట్ర గవర్నర్ శ్రీశైలం చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ వద్ద మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఫారుక్, బీసీ జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
Similar News
News November 8, 2025
కీరాతో ఎన్నో లాభాలు

కీరా దోసకాయ అంటే తెలియని వారెవరూ ఉండరు. దీన్ని తినడం వల్ల శరీరానికి ఎన్నోలాభాలుంటాయంటున్నారు నిపుణులు. *కీరా దోసకాయ రసాన్ని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. *C, K విటమిన్లు, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *పీచు అధికంగా ఉన్నందున జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. వ్యర్థాలను తొలగించి, పొట్ట, పేగులను శుభ్రపరుస్తుంది. * దీన్ని తినడం వల్ల గుండెఆరోగ్యంగా ఉంటుంది.
News November 8, 2025
పిట్లం: బువ్వ విలువ తెలిసిన అవ్వ..!

వరి కోతలు చివరి దశకు చేరుకోవడంతో, రైతులు కోసిన ధాన్యాన్ని రోడ్లపై రాశులుగా ఆరబెట్టారు. ఈ ధాన్యం ఎండిన తరువాత రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో, బువ్వ విలువ తెలిసిన కొందరు వృద్ధ మహిళలు రోడ్లపై పడివున్న ధాన్యపు గింజలను వృథా చేయకుండా సేకరించారు. రాళ్లు లేకుండా శుభ్రం చేసి జాగ్రత్తగా సంచుల్లో నింపుకున్నారు. పిట్లం జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై శనివారం కనిపించిన దృశ్యమిది.
News November 8, 2025
అంతర్ జిల్లా దొంగల ముఠా పట్టివేత: కామారెడ్డి SP

KMR జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాలోని 5 గురుని పోలీసులు పట్టుకున్నారు. దేవునిపల్లిలో (కారు, విడి భాగాలు చోరీ), కామారెడ్డి, సదాశివనగర్, భిక్కనూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 15 దొంగతనాలు (బంగారం, వెండి, నగదు, బైక్లు చోరీ) ఒప్పుకున్నట్లు SP రాజేష్ చంద్ర పేర్కొన్నారు. NZB, నిర్మల్ జిల్లాల్లోనూ నేరాలకు పాల్పడ్డట్లు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.


