News February 24, 2025
యూజీసీ జేఆర్ఎఫ్ సాధించిన ఏయూ విద్యార్థి

ఆంధ్ర విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగ విద్యార్థి శ్యామ్ యూజీసీ జేఆర్ఎఫ్ సాధించాడు. దివ్యాంగుడైన శ్యామ్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రతిభ అర్హత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ జేఆర్ఎఫ్ సాధించడం పట్ల విభాగాధిపతి ఆచార్య పేటేటి ప్రేమానందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి శ్యామ్ని విభాగంలో సత్కరించారు. శ్యామ్ నుంచి యువత స్ఫూర్తి పొందాలని చెప్పారు.
Similar News
News February 25, 2025
విశాఖ: మాతృ మరణాలపై సమీక్ష

విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో DMHO జగదీశ్వర రావు సోమవారం మాతృ మరణాలపై డిస్ట్రిక్ట్ లెవెల్ ఎం.సి.హెచ్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరిలో రేవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి రెడ్డిపల్లిలోని ఒక మాతృ మరణం జరిగిందన్నారు.ఇకపై మాతృ మరణాలు జరగకుండా చూడాలని హెచ్చరించారు. గర్భిణీగా ఉన్నప్పుడే హై రిస్క్ ప్రెగ్నెన్సి గుర్తించి తగిన సలహాలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
News February 25, 2025
సమన్వయకర్తలుగా పంచకర్ల, వంశీకృష్ణ యాదవ్

మార్చి 14వ తేదిన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు విశాఖ పార్లమెంట్కు సంబందించి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ను నియమించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ ను అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. వీరు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించి వేడుకలు విజయవంతానికి కృషి చేయాలి.
News February 24, 2025
విశాఖ జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ యుాజీసీ జేఆర్ఎఫ్ సాధించిన దివ్యాంగ ఏయూ విద్యార్థి
➤ వాల్తేర్ డీఆర్ఎంగా లలిత్ బోహ్రా బాధ్యతలు స్వీకరణ
➤ అవమానంతో తన బిడ్డ చనిపోయాడంటూ గోపాలపట్నంలో నిరసన
➤ రుషికొండలో పల్సస్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగుల ఆందోళన
➤ ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్ష ఫీజు గడువు పెంపు(మార్చి 13)
➤ ఆనందపురం ఎస్ఐ ఎడమ చేతికి తీవ్ర గాయం
➤ విశాఖ ఆర్డీవోపై చర్యలకు జర్నలిస్టు సంఘాల డిమాండ్