News February 24, 2025
ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కు గడువు పెంపు

ఏయూ దూరవిద్యా కేంద్రంలో పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలకు దరఖాస్తు చేయడానికి మార్చి 13 వరకు గడువున్నట్లు డైరెక్టర్ తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో మార్చి 17 వరకు, మార్చ్ 20 వరకు రూ.2000 అపరాధ రుసుముతో దరఖాస్తులను స్వీకరిస్తారు. మార్చి 20 తర్వాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవన్నారు. మార్చి 28 నుంచి పరీక్షలు ప్రారంభంఅవుతాయని తెలిపారు. పూర్తి వివరాలకు ఏయూ వెబ్ సైట్ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News January 6, 2026
విశాఖ జూలో జనవరి 8 నుంచి ‘వింటర్ క్యాంప్’

విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్లో జనవరి 8 నుంచి 11 వరకు చిన్నారుల కోసం ‘జూ వింటర్ క్యాంప్’ నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించే ఈ క్యాంప్లో వెటరినరీ హాస్పిటల్ సందర్శన, జంతు సంరక్షకులతో ముఖాముఖి వంటివి ఉంటాయి. పాల్గొనే వారికి టీ-షర్ట్, సర్టిఫికెట్, 10 సార్లు ఉచిత ప్రవేశం కల్పించే ‘జూ పాస్పోర్ట్’ అందజేస్తారు.
News January 5, 2026
మహిళల భద్రతకు సఖి వాహనం: కలెక్టర్

మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ స్టాప్ సెంటర్ సఖి వాహనాన్ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఎలాంటి భయాందోళన లేకుండా స్వేచ్ఛగా ప్రయాణించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు ఈ వాహనం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలో మహిళలు, బాలికల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
News January 5, 2026
కౌన్సిల్ ఆమోదం లేకుండా టెండర్లు: పీతల మూర్తి ఫిర్యాదు

జీవీఎంసీలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ముడసర్లోవ భూములపై రక్షణ ఏర్పాటు చేసి కబ్జాలు తొలగించాలని కమిషనర్ కేతన్ గార్గ్కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. గుర్రాల పార్కు టెండర్ రద్దు చేయాలన్నారు. గత ప్రభుత్వం కౌన్సిల్ ఆమోదం లేకుండా ఆరు కోట్ల రూపాయలు టెండర్లు ఖరారు చేశారని ఆరోపించారు. ఇటీవల అధికారులు కూడా కౌన్సిల్కు తెలియకుండా చెల్లింపులు చేశారన్నారు.


