News February 24, 2025

ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌కు గడువు పెంపు

image

ఏయూ దూరవిద్యా కేంద్రంలో పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలకు దరఖాస్తు చేయడానికి మార్చి 13 వరకు గడువున్నట్లు డైరెక్టర్ తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో మార్చి 17 వరకు, మార్చ్ 20 వరకు రూ.2000 అపరాధ రుసుముతో దరఖాస్తులను స్వీకరిస్తారు. మార్చి 20 తర్వాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవన్నారు. మార్చి 28 నుంచి పరీక్షలు ప్రారంభంఅవుతాయని తెలిపారు. పూర్తి వివరాలకు ఏయూ వెబ్ సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News September 15, 2025

విశాఖ: బస్సుల్లో రద్దీ.. ప్రయాణ సమయాలు మార్చుకోవాలని పిలుపు

image

స్త్రీ శక్తి పథకంతో జిల్లాలోని బస్సుల్లో రద్దీ పెరిగిందని, RTC ప్రయాణికులు తమ ప్రయాణ సమయాలను మార్చుకోవాలని RTC విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు సూచించారు. రద్దీకి తగ్గట్లు ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదన్నారు. ఉదయం 7 నుంచి 10, సా. 4- 7 గంటల వరకు విద్యార్థులు, కార్మికులు, ఇతర ప్రయాణికుల రద్దీ ఉంటోందన్నారు. దీంతో ఉ.10 నుంచి, సా.7 తర్వాత ప్రయాణాలు చేసేలా చూసుకోవాలని మహిళలు, ప్రయాణికులను కోరారు.

News September 15, 2025

మధురవాడలో ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు

image

మధురవాడ శిల్పారామంలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు విజయవంతంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు. ముగింపు వేడుకల్లో సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం మహిళలకు ఆత్మరక్షణలో తైక్వాండో ప్రాధాన్యాన్ని వివరించారు.

News September 14, 2025

రుషికొండ బీచ్‌లో ఇద్దరు బాలురు గల్లంతు

image

రుషికొండ బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. పీఎం పాలెం, ఆర్‌హెచ్‌ కాలనీ ప్రాంతాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు సంజయ్, సాయితో పాటు మరో ఇద్దరు రుషికొండ బీచ్‌కు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగగా అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని మెరైన్ పోలీసులు, లైఫ్ గాడ్స్ కాపాడారు. సంజయ్, సాయి అచూకీ ఇంకా లభ్యం కాలేదని పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు.