News February 24, 2025

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

image

పది, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహనపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం బోర్డు పరీక్షల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News February 25, 2025

నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి మరణించిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. భవానిపేట వాసి మాగిరి లింగారం(57) తన ద్విచక్ర వాహనంపై చేపలను అమ్మి తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొనడంతో మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రమేశ్ తెలిపారు.

News February 25, 2025

ఖమ్మం: మందు బాబులకు షాక్  

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలు రెండు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఫిబ్రవరి 25 సాయంత్రం 4  గంటల నుంచి ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 25, 2025

మహిళా కాంగ్రెస్ సభ్యత్వాల్లో భద్రాద్రి జిల్లాకు 4వ స్థానం

image

గాంధీభవన్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన జరిగిన నారి న్యాయ సమ్మేళన్ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొన్నారు. తెలంగాణలో లక్ష సభ్యత్వాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ హాజరయ్యారన్నారు. మహిళా కాంగ్రెస్ సభ్యత్వాల్లో జిల్లాకు 4వ స్థానం దక్కిందన్నారు.

error: Content is protected !!