News February 25, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్..

image

*మధ్యతరగతి వారిని ఆదుకున్న ఘనత బీజేపీ దే: MP డీకే అరుణ
* ఓటు వేసేలా వెసులుబాటు కల్పించాలి: కలెక్టర్
*గురుకుల ప్రవేశ పరీక్షకు 97.34% హాజరు @KMR
*పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన బాన్సువాడ సబ్ కలెక్టర్
*పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు CPM మద్దతు
*న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తాం: MP డీకే అరుణ
* విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: సబ్ కలెక్టర్
* కొత్త డైట్ మెనూ అమలు పరచాలి: KMR కలెక్టర్

Similar News

News February 25, 2025

గర్భిణులు, బాలింతలు జాగ్రత్త!

image

AP: ‘జనని సురక్ష యోజన’ పథకం ద్వారా సాయం చేస్తామని గర్భిణులు, బాలింతలకు ఫేక్ లింక్‌లు, మెసేజ్‌లు పంపి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేస్తున్నారు. ఇలా కొందరు మోసపోతున్నట్లు బాపట్ల SP తుషార్ డూడీ వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం ఇచ్చారు. కేటుగాళ్లు తొలుత అంగన్వాడీ, ANMల వివరాలు సేకరించి ఆపై బాలింతలు, గర్భిణుల ఫోన్ నంబర్లు రాబడుతున్నారు. వాళ్ల వాట్సాప్ నంబరుకు CM ఫొటో పెట్టుకొని నమ్మిస్తూ మోసం చేస్తున్నారు.

News February 25, 2025

మూడోరోజు.. ఇంకా లభించని ఆచూకీ

image

TG: SLBC టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని మూడురోజులు అవుతున్నా వారి ఆచూకీ లభించలేదు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టన్నెల్‌లో భారీగా ఊట నీరు వస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. బురద మరింత పేరుకుపోతోంది. లోపలికి వెళ్లాలని ప్రయత్నిస్తుండగా మట్టి పెళ్లలు విరిగిపడుతున్నాయి. ర్యాట్ హోల్ మైనర్స్ కూడా బురద లోంచి లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

News February 25, 2025

గంజాయి కేసులో పదేళ్ల జైలు శిక్ష: ఎస్పీ

image

గంజాయి కేసులో ముద్దాయిలకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ అనకాపల్లి 10వ అదనపు జిల్లా కోర్టు తీర్పును ఇచ్చినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. 2021 మే 20వ తేదీన అనకాపల్లి టౌన్ పరిధిలో 20 కేజీల గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కోర్టు సోమవారం శిక్షను విధించిందని ఎస్పీ తెలిపారు.

error: Content is protected !!