News February 25, 2025
మేడ్చల్: ఇంటర్ ఎగ్జామ్స్ రాయనున్న 1.27లక్షల మంది విద్యార్థులు

మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి కో ఆర్డినేషన్ మీటింగ్ ను సోమవారం కలెక్టర్ ఛాంబర్లో అన్నిశాఖల అధికారులతో కలెక్టర్ గౌతం నిర్వహించారు. ఈనెల 5వ తేదీ నుంచి మార్చ్ 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని, ఈ పరీక్షలకు 150 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఫస్ట్ ఇయర్ 64,107మంది, సెకెండ్ ఇయర్ 62,316 విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.
Similar News
News January 17, 2026
ఏపీ నుంచి వచ్చే వాహనాల దారి మళ్లింపు

సంక్రాంతి సెలవులు ముగియడంతో AP నుంచి HYDకు వాహనాల రద్దీ పెరిగింది. NH-65 విస్తరణ పనుల దృష్ట్యా అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గుంటూరు నుంచి HYD వచ్చే వెహికల్స్ను మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి-మాల్, మాచర్ల-సాగర్-పెద్దవూర-చింతపల్లి-మాల్ మీదుగా, విజయవాడ నుంచి వచ్చే వాటిని కోదాడ-మాల్ నుంచి HYDకు పంపిస్తున్నారు. NH-65పై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా దారి మళ్లించనున్నారు.
News January 17, 2026
నిర్మల్: ప్రతిపాదనలన్నింటికీ సీఎం ‘ఓకే’

నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి భాట’ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. స్థానిక ప్రజాప్రతినిధులు కోరిన పలు అభివృద్ధి పనులకు సానుకూలంగా స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తులపై సైతం సీఎం సానుకూలత వ్యక్తం చేస్తూ నిధులు మంజూరు చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని సీఎం ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
News January 17, 2026
గోరంట్ల మాధవ్పై నాన్ బెయిలబుల్ వారెంట్

అత్యాచార బాధితురాలి పేరు బయటపెట్టారంటూ నమోదైన కేసులో మాజీ MP గోరంట్ల మాధవ్పై విజయవాడ పోక్సో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు మాధవ్పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేశారు.


