News February 25, 2025
NRPT: ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈనెల 24 నుంచి 29 వరకు జరిగే వారోత్సవాలను సందర్భంగా బ్యాంక్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ‘ఆర్థిక అక్షరాస్యత ఐశ్వర్యానికి బాట’ వివిధ రకాల సురక్షితమైన పొదుపు వర్గాలను ఎంచుకొని భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు తగ్గట్టు పొదుపు చేసుకోవాలన్నారు.
Similar News
News January 12, 2026
కోల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

కోల్ ఇండియా లిమిటెడ్(<
News January 12, 2026
పనసలో కాయకుళ్లు తెగులు లక్షణాలు

పనసలో కాయకుళ్లు తెగులు ప్రధానంగా బూజు తెగులు వల్ల వస్తుంది. ఇది పూత, పిందె దశలో మొదలై కాయకు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించడం వల్ల తొలుత మగ పువ్వులు, పూత, పిందెలు కుళ్లిపోతాయి. తర్వాత ఎదిగే కాయలు నల్లగా మారి కుళ్లిపోతాయి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ తెగులు ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకుంటే దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
News January 12, 2026
MNCL: జాతరకు వేళాయె.. సౌకర్యాలు కరువాయే

సమ్మక్క సారలమ్మ జాతర వేడుకల గడువు సమీపిస్తున్నా జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు ఇంకా మొదలు కాలేదు. గోదావరి నది తీరంలో నిర్వహించే జాతరకు వారం క్రితం నిర్వహించిన వేలంపాటలో భారీగా దేవాదాయ శాఖకు ఆదాయం వచ్చింది. అయినప్పటికీ జాతర వద్ద ఏర్పాట్లు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు జాతర కమిటీలో రాజకీయాలు చోటుచేసుకోవడం గమనార్హం. అధికారులు స్పందించి ఇప్పటికైనా ఏర్పాట్లు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.


