News February 25, 2025

అనంత జిల్లా వ్యాప్తంగా 59 ఫిర్యాదులు

image

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 59 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ పి.జగదీశ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలనే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 18, 2026

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్: JNTU వీసీ

image

అనంతపురం JNTUలో ఆదివారం NTR వర్ధంతిని పురస్కరించుకొని వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్యతో కలిసి NTR విగ్రహానికి పూలమాలలు ఘన నివాళులర్పించారు. వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. సబ్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినీ హీరోగా, సీఎంగా ఎదిగిన NTR జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

News January 18, 2026

అనంత జిల్లా అల్లుడికి 116 రకాల పిండి వంటలు

image

అనంతపురం జిల్లాకు చెందిన గౌతమ్‌ గతేడాది గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంక్రాంతి పండుగకు అత్త గారింటికి వెళ్లారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వారు గోదారోళ్ల మర్యాదలు చూపించారు. 116 రకాల పిండి వంటలతో భోజనం వడ్డించారు. కొత్త అల్లుళ్లకు రకరకాల పిండి వంటలతో మర్యాదలు చేయడం ఈ మధ్య గోదావరి జిల్లాలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.

News January 18, 2026

అనంతపురం: 19న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

అనంతపురం జిల్లా ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. ఈనెల 19న కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీదారులు meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.