News February 25, 2025

ఈ నెల 28 వరకు ఆర్థిక అక్షరాస్యత: ASF కలెక్టర్

image

జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఆర్థిక అవగాహన కలిగి ఉండాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. సోమవారం ఎస్బీఐ నిర్వహించిన మహిళా ఉద్యోగుల ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. RBI 2016 నుంచి ప్రతి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తుందన్నారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఆర్థిక అక్షరాస్యత ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆయనతో పాటు జిల్లా అధికారులు ఉన్నారు.

Similar News

News January 14, 2026

సంక్రాంతి శుభవేళ ఆచరించాల్సిన సంప్రదాయాలు

image

సంక్రాంతి రోజున నదీ స్నానం చేసి అర్ఘ్యం వదలాలి. శివకేశవులు, లక్ష్మీదేవిని పూజించి, నువ్వులు, బెల్లం, కొత్త బియ్యం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లోకి కొత్త చీపురు కొనడం లక్ష్మీప్రదమని పండితులు చెబుతారు. పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ, బ్రాహ్మణులకు స్వయంపాకం, వస్త్రదానం చేయడం వల్ల పితృదోషాలు తొలగుతాయి. అలాగే పేదలకు దానధర్మాలు చేస్తూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.

News January 14, 2026

గుంటూరు: DLSAలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా న్యాయసేవాధికార సంస్ధ(DLSA)లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DLSA కార్యదర్శి జియావుద్దీన్ తెలిపారు. ఒక రికార్డు అసిస్టెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టును ఓపెన్ కేటగిరీలో రెగ్యులర్ ప్రాతిపదికన నియమించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మరిన్ని వివరాలకు
https://Guntur.dcourts.gov.inని సందర్శించాలని సూచించారు.

News January 14, 2026

భోగి పండ్లు ఎలా, ఎప్పుడు పోయాలి?

image

భోగి సందర్భంగా ఇవాళ చిన్నారులపై భోగి పండ్లు పోసే సంప్రదాయం తరతరాలుగా వస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం మేరకు.. చెరకు ముక్కలు, రేగి పండ్లు, పైసలు కలిపి పిల్లలను కూర్చోబెట్టి దిగదుడుపు తీసి తలమీద నుంచి కిందకు వదిలేయాలి. దీంతో భోగి పీడ తొలగిపోయి వాళ్లు భోగం అనుభవించడానికి కావలసిన శక్తిని పొందుతారు. అయితే సాయంత్రం వేళ వీటిని పోస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు.