News February 25, 2025

నాణ్యమైన విద్యుత్ సరఫరాకు డేటా కీలకం: సీఎండీ

image

హనుమకొండలోని NPDCL కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వివిధ జిల్లాలకు సంబంధించిన DE, ADE, AE MRT విభాగానికి చెందిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ నుంచి రియల్ టైం డేటా ఎప్పటికప్పుడు పొందడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి డేటా కీలకమని సూచించారు.

Similar News

News November 5, 2025

NLG: 4400 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

image

నల్గొండ జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లుల పరిధిలో L-1 కింద ఉన్న 9 కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించినట్లు మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి తెలిపారు. ఇప్పటివరకు 4400 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12% తేమ ఉండడంతో పాటు కపాస్ కిసాన్ అనే యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు మాత్రమే స్లాట్ ఆధారంగా పత్తిని కొనుగోలు కేంద్రాల్లోకి తీసుకురావాలని సూచించారు.

News November 5, 2025

NLG: కొనసాగుతున్న ప్రైవేట్ కళాశాలల బంద్

image

జిల్లాలో ప్రైవేట్‌ కళాశాలల నిరవధిక బంద్‌ కొనసాగుతుంది. రెండో రోజు ఉమ్మడి జిల్లాలోని MGU పరిధిలో కొనసాగింది. బంద్‌లో భాగంగా తెలంగాణ ప్రైవేట్‌ డిగ్రీ అండ్‌ పీజీ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యూనివర్సిటీ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందన్నారు.

News November 5, 2025

సిరిసిల్ల: ఈనెల 15న ప్రత్యేక లోక్ అదాలత్‌

image

ఈనెల 15న జరిగే ప్రత్యేక లోక్ అదాలత్‌లో ప్రైవేట్ కంప్లైంట్ కేసులు, పాత కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, అధ్యక్షురాలు జిల్లా న్యాయ సేవాధికర సంస్థ పుష్పలత సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులతో స్పెషల్ లోక్ అదాలత్‌పై ఆమె సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడారు.