News February 25, 2025
చికెన్, గుడ్లు నిర్భయంగా తినొచ్చు: VZM కలెక్టర్

ప్రజలు చికెన్, కోడిగుడ్లను నిర్భయంగా తినొచ్చని కలెక్టర్ అంబేడ్కర్ సూచించారు. బర్డ్ఫ్లూ వ్యాధి, చికెన్, కోడిగుడ్ల వినియోగంపై తమ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బర్డ్ఫ్లూ వ్యాధి గానీ, ఆ లక్షణాలు గల వ్యాధిగ్రస్తులు గానీ లేరని పశు వైద్యాధికారులు దృవీకరించారని చెప్పారు.
Similar News
News February 13, 2026
గంట్యాడ: పచ్చకామెర్లతో యువకుడి మృతి

గంట్యాడ మండలం కొండ తామరాపల్లి గ్రామానికి చెందిన యువకుడు పచ్చకామెర్లతో మృతి చెందాడు. కోన పవన్ కుమార్ (22) జ్వరం, పచ్చకామెర్లు రావడంతో 5 రోజుల క్రితం విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. పవన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్పై ఉన్న పవన్ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు.
News February 13, 2026
హ్యూమన్ రైట్స్ పేరుతో బెదిరింపులు చేస్తే జైలుకే: ఎస్పీ

హ్యూమన్ రైట్స్ కమిషన్, RTI ప్రతినిధులమని చెబుతూ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. గ్రామస్థాయిలో ఇటువంటి సంస్థలకు ఎటువంటి ప్రైవేట్ ప్రతినిధులు ఉండరని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా గుర్తింపు కార్డులు చూపి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
News February 13, 2026
హ్యూమన్ రైట్స్ పేరుతో బెదిరింపులు చేస్తే జైలుకే: ఎస్పీ

హ్యూమన్ రైట్స్ కమిషన్, RTI ప్రతినిధులమని చెబుతూ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. గ్రామస్థాయిలో ఇటువంటి సంస్థలకు ఎటువంటి ప్రైవేట్ ప్రతినిధులు ఉండరని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా గుర్తింపు కార్డులు చూపి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.


