News February 25, 2025

కామారెడ్డి: వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పండగ సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోష్నా సోమవారం తెలిపారు. 25, 26, 27 తేదీల్లో నిజామాబాద్ నుంచి వేములవాడకు పెద్దలకు రూ.270, పిల్లలకు రూ.150 టికెట్ ధరతో.. ఆర్మూర్ నుంచి రూ.220 పెద్దలకు, రూ.120 పిల్లలకు, కామారెడ్డి నుంచి పెద్దలకు రూ.140, పిల్లలకు రూ.80 టికెట్ ధర ఉంటుందన్నారు. 

Similar News

News February 25, 2025

వైసీపీ నుంచి అనంతపురం జిల్లా నేత బహిష్కరణ

image

విజయవాడలోని స్పా సెంటర్‌లో పోలీసులకు దొరికిన వైసీపీ నేత వడిత్యా శంకర్ నాయక్‌ను పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. శంకర్ నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు.

News February 25, 2025

వైసీపీ నుంచి అనంతపురం జిల్లా నేత బహిష్కరణ

image

విజయవాడలోని స్పా సెంటర్‌లో పోలీసులకు దొరికిన వైసీపీ నేత వడిత్యా శంకర్ నాయక్‌ను పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. శంకర్ నాయక్ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు.

News February 25, 2025

నలుగురు అన్నదాతల ఆత్మహత్య

image

TG: అప్పుల బాధతో గత 2 రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. యాదాద్రి(D) వీరారెడ్డిపల్లికి చెందిన రాంచంద్రయ్య పత్తి సాగు చేయగా వర్షాభావంతో దిగుబడి రాలేదు. దీంతో అప్పు తీర్చలేక ఆదివారం పురుగుమందు తాగి చనిపోయారు. సిరిసిల్ల(D) పోతుగల్‌లో దేవయ్య, భూపాలపల్లి(D) మొగుళ్లపల్లిలో రాజు, మహబూబాబాద్(D) వేములపల్లిలో వెంకన్న పంట దిగుబడి రాకపోవడంతో అప్పు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నారు.

error: Content is protected !!