News February 25, 2025

కామారెడ్డి: వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పండగ సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోష్నా సోమవారం తెలిపారు. 25, 26, 27 తేదీల్లో నిజామాబాద్ నుంచి వేములవాడకు పెద్దలకు రూ.270, పిల్లలకు రూ.150 టికెట్ ధరతో.. ఆర్మూర్ నుంచి రూ.220 పెద్దలకు, రూ.120 పిల్లలకు, కామారెడ్డి నుంచి పెద్దలకు రూ.140, పిల్లలకు రూ.80 టికెట్ ధర ఉంటుందన్నారు. 

Similar News

News January 8, 2026

వనపర్తి: స్పోర్ట్స్ రంగంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

image

స్పోర్ట్స్ రంగంపై బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం 2వ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, కాంగ్రెస్ వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్, ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీనివాస్, రాజు తదితరులు ఉన్నారు.

News January 8, 2026

యూరియా తీసుకున్న రైతులపై నిఘా

image

TG: ఒకేసారి 40-50 బస్తాల యూరియా కొనుగోలు చేసిన రైతులపై వ్యవసాయ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. 4 జిల్లాల్లో అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి రావడంతో క్షేత్రస్థాయి విచారణకు రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. రైతుల భూమి విస్తీర్ణం, పంటలు, యూరియా అవసరం, వినియోగాన్ని పరిశీలించనున్నాయి.

News January 8, 2026

మిరపలో వేరుపురుగు నివారణకు సూచనలు

image

మిరపలో వేరు పురుగు నివారణకు ముందుగా వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. క్లోరోఫైరిఫాస్ 8 మి.లీ ఒక కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. జీవ సంబంధిత మెటారైజియం ఎనాయిసోప్లి వేర్ల దగ్గర పోయాలి. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 5-10 కిలోలు పొడి ఇసుకతో కలిపి నేలలో తేలికపాటి తడి ఉన్నప్పుడు సాళ్ల వెంట వేసుకోవాలి. అలాగే ఎకరాకు 10కిలోల వేపపిండి వేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.