News February 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
Similar News
News February 25, 2025
నలుగురు అన్నదాతల ఆత్మహత్య

TG: అప్పుల బాధతో గత 2 రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. యాదాద్రి(D) వీరారెడ్డిపల్లికి చెందిన రాంచంద్రయ్య పత్తి సాగు చేయగా వర్షాభావంతో దిగుబడి రాలేదు. దీంతో అప్పు తీర్చలేక ఆదివారం పురుగుమందు తాగి చనిపోయారు. సిరిసిల్ల(D) పోతుగల్లో దేవయ్య, భూపాలపల్లి(D) మొగుళ్లపల్లిలో రాజు, మహబూబాబాద్(D) వేములపల్లిలో వెంకన్న పంట దిగుబడి రాకపోవడంతో అప్పు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నారు.
News February 25, 2025
నేటితో ముగియనున్న MLC ఎన్నికల ప్రచారం

TG: రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం ముగియనుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ను తలపించేలా నెల రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ జిల్లాల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు, నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న పోలింగ్ జరగనుంది.
News February 25, 2025
టెన్త్ విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్

AP: ప్రభుత్వ బడుల్లో చదివే టెన్త్ విద్యార్థులకు మార్చి 3 నుంచి 13 వరకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించనున్నారు. పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగానే ఈ పరీక్షలు జరగనున్నాయి. గ్రాండ్ టెస్ట్ ముగిసిన 3 రోజులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తొలిసారి ఇంగ్లిష్ మీడియంలో NCERT సిలబస్ పరీక్షలు రాస్తున్నందున ఈ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు.