News February 25, 2025
మోదీ చెప్పిన ఫూల్ మఖానా లాభాలివే..

ఏడాదిలో 300రోజులు ఫూల్ మఖానా తింటానని PM మోదీ <<15567735>>చెప్పారు<<>>. మరి ఆ సూపర్ ఫుడ్ తీసుకుంటే కలిగే లాభాలేంటో చూద్దామా?
* క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ ఉంటాయి.
* యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేసి, టైప్-2 డయాబెటిస్కు అడ్డుకట్ట వేస్తాయి.
* ఫైబర్ ఆకలిని తగ్గించి, బరువు పెరగకుండా చేస్తుంది.
* అమినో యాసిడ్స్ చర్మంపై మడతలు, మొటిమల్ని తగ్గిస్తాయి.
Similar News
News February 25, 2025
ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. త్వరలో మొబైల్స్కు లింకులు

TG: ఇంటర్ హాల్ టికెట్లను రిలీజ్ చేసినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. కాలేజీల లాగిన్లలో హాల్ టికెట్లు అప్లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. అతి త్వరలోనే విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ల డౌన్లోడ్ లింకును పంపిస్తామన్నారు. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
News February 25, 2025
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

AP: తిరుమలలో టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనం కోసం 8 గంటలు పడుతోంది. 4 కంపార్ట్మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,764 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 23,504 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.14కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. నిన్న 4.8లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను TTD రిలీజ్ చేయగా 20 నిమిషాల్లోనే బుక్ అయ్యాయి.
News February 25, 2025
జేఈఈ మెయిన్ సెషన్2 దరఖాస్తులకు నేడే ఆఖరు

జేఈఈ మెయిన్ సెషన్2 దరఖాస్తులకు గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 1-8 మధ్య మెయిన్ పరీక్ష జరగనుంది. తొలి సెషన్ పరీక్ష జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే.
వెబ్సైట్: https://jeemain.nta.nic.in/