News February 25, 2025
వడ్డేపల్లి: పెళ్లింట విషాదం.. వరుడి సోదరుడు మృతి

వడ్డేపల్లి మండలం శాంతినగర్ సమీపంలో సోమవారం బైక్, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మురళి మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. మండలంలోని బుడ్డమొరుసుకి చెందిన రాజన్నకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జానకి రాముడు వివాహం ఆదివారం జరిగింది. వివాహానికి వచ్చిన బంధువులను శాంతినగర్ లో దింపేందుకు చిన్న కుమారుడు మురళి వెళుతుండగా ప్రమాదం జరిగి పెళ్లింట విషాదం నెలకొంది. బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
Similar News
News July 4, 2025
IIIT విద్యార్థుల జాబితా విడుదల

TG: 2025-26 విద్యా సంవత్సరానికి IIITలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఇన్ఛార్జ్ వీసీ విడుదల చేశారు. 20,258 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా తొలి విడతలో 1,690 మందిని ఎంపిక చేశారు. విద్యార్థులకు టెన్త్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఎంపిక జరగ్గా, 88శాతం సీట్లు ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారికే దక్కాయి. ఎంపికైన విద్యార్థులకు జులై 7, 8, 9 తేదీల్లో యూనివర్సిటీ క్యాంపస్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. <
News July 4, 2025
ములుగు జిల్లాలో పేలిన మందుపాతర

ములుగు జిల్లాలో మరోసారి మందుపాతర పేలింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెంకటాపురం మండలం తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని చెలిమల గుట్టలపై శుక్రవారం మందుపాతర పేలింది. ఈ ఘటనలో పాత్రపురం పంచాయతీ ముకునూరు పాలెం గ్రామానికి చెందిన వృద్ధుడు సోయం కామయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 4, 2025
కరీంనగర్: బయట ఫుడ్ తింటున్నారా..? బీ కేర్ ఫుల్

KNR, జ్యోతినగర్లోని రాజుగారి బిర్యానీ అడ్డా రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్ రెడ్డి ఈరోజు తనిఖీ చేశారు. ఒక ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు జరిగాయి. కిచెన్, ఫ్రీజర్లో ముందురోజు మిగిలిపోయిన 17KGల వండిన చికెన్, కార్న్, ఇతర కూరగాయలు, వస్తువులను గుర్తించి ధ్వంసంచేశారు. చికెన్ ఐటమ్స్లో కృత్రిమరంగులు వాడినందుకు నోటీసులు జారీచేశారు. మాంసాహార ముడిపదార్థాలపై తప్పనిసరిగా తేదీ, లేబుల్ వేయాలని ఆదేశించారు.