News February 25, 2025

వడ్డేపల్లి: పెళ్లింట విషాదం.. వరుడి సోదరుడు మృతి

image

వడ్డేపల్లి మండలం శాంతినగర్ సమీపంలో సోమవారం బైక్, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మురళి మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. మండలంలోని బుడ్డమొరుసుకి చెందిన రాజన్నకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జానకి రాముడు వివాహం ఆదివారం జరిగింది. వివాహానికి వచ్చిన బంధువులను శాంతినగర్ లో దింపేందుకు చిన్న కుమారుడు మురళి వెళుతుండగా ప్రమాదం జరిగి పెళ్లింట విషాదం నెలకొంది. బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

Similar News

News October 17, 2025

మహిళల కోసం ఇన్ఫోసిస్ కొత్త ప్రోగ్రామ్

image

కనీసం 6 నెలల కెరీర్‌ గ్యాప్ వచ్చిన మహిళా నిపుణులకు ఉద్యోగాలిచ్చేందుకు ఇన్ఫోసిన్ ముందుకొచ్చింది. ‘రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ ఇనిషేటివ్’ పేరుతో గత నెల కొత్త రిఫరల్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు అర్హులైన మహిళలను రిఫర్ చేయొచ్చు. వారు జాబ్‌కు ఎంపికైతే లెవెల్-3లో రూ.10వేలు, లెవెల్-4లో రూ.25వేలు, లెవెల్-5లో రూ.35వేలు, లెవెల్ 6లో రూ.50వేల వరకు రివార్డులు అందించనుంది.

News October 17, 2025

646 పోస్టులు.. దరఖాస్తుకు 3రోజులే సమయం

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్‌)లో 646 పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3రోజులే (OCT 20) సమయం ఉంది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cdac.in

News October 17, 2025

కాజీపేట: అందుబాటులోకి ప్రత్యేక పర్యాటక రైలు..!

image

ప్రత్యేక పర్యాటక రైలును అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే మేనేజర్ వెంకటేశ్ తెలిపారు. KZPలో ఈ రైలు యాత్ర ఈ నెల 26 నుంచి నవంబరు 4 వరకు ఉంటుందని పేర్కొన్నారు. యాత్రలో భాగంగా ద్వారకాదీష్ మందిరం, నాగేశ్వర జ్యోతీర్లింగ మందిరం, భేట్ ద్వారక, సోమ నాథ్ జ్యోతిర్లింగ మందిరం, సబర్మతి ఆశ్రమం సందర్శన, సూర్య దేవాలయం, రాణికి వావ్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం) సందర్శించవచ్చని చెప్పారు.