News March 21, 2024
సుప్రీంకోర్టుకు ఆప్ నేతలు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711029889307-normal-WIFI.webp)
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారనే ప్రచారంతో ఆప్ నేతలు అలర్ట్ అయ్యారు. అత్యవసరంగా సమావేశమై తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీఎంను ప్రశ్నించేందుకు 12 మంది ఈడీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. కేజ్రీవాల్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
Similar News
News July 8, 2024
డీఎస్సీ పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720894935-normal-WIFI.webp)
TG: డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన చేస్తుండగా.. పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ స్పందించింది. DSC పరీక్షలు <<13528813>>యథాతథంగా<<>> నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
News July 8, 2024
BREAKING: JL ఫలితాలు విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32023/1679908321315-normal-WIFI.webp)
TG: జూనియర్ లెక్చరర్స్ పరీక్షల ఫలితాలను TGPSC విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టును వెబ్సైటులో ఉంచింది. 1:2 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ జాబితాను త్వరలోనే వెల్లడిస్తామంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తామంది. కాగా గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే జేఎల్ పరీక్షలు జరిగాయి. ఫలితాల కోసం ఇక్కడ <
News July 8, 2024
భూమన, ధర్మారెడ్డిపై టీడీపీ నేతల ఫిర్యాదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720444976855-normal-WIFI.webp)
AP: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిపై సీఎస్ నీరభ్ కుమార్కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారని, అక్రమాలు చేశారని చెప్పారు. శ్రీవారిని దర్శించుకునే వ్యాపారవేత్తలతో ధర్మారెడ్డి వైసీపీకి విరాళాలు ఇప్పించారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై సీఐడీ, విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించాలని కోరారు.