News February 25, 2025
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా ఏప్రిల్ 6, 7, 8 తేదీల్లో పొరపాట్ల సవరణకు అవకాశమిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు రూ.500, ఇతరులకు రూ.900గా నిర్ణయించారు. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు పరీక్షలు జరగనున్నాయి.
వెబ్సైట్: https://eapcet.tgche.ac.in/
Similar News
News February 25, 2025
జోకర్గా జగన్.. జనసేన ఎమ్మెల్యే సెటైర్

AP: ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా జగన్ ఓ జోకర్గా మిగిలారని జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తోన్న ఆయన.. ప్రజా తీర్పును గౌరవించలేదని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు.
News February 25, 2025
జపాన్ మీడియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జపాన్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 28న ‘దేవర’ రిలీజ్ కానుండటంతో ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్కు వెళ్లనున్నారు. ఈక్రమంలో అక్కడి మీడియాతో తారక్ వర్చువల్ ఇంటర్వ్యూలు ప్రారంభించినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.
News February 25, 2025
అందుకే జగన్ అసెంబ్లీకి వెళ్లారు: పురందీశ్వరి

AP: ఆరు నెలలు అసెంబ్లీకి వెళ్లకపోతే ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుందని బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి అన్నారు. అందుకే నిన్న జగన్ సభకు వెళ్లి అటెండెన్స్ వేయించుకున్నారని విమర్శించారు. ప్రజలు తనకిచ్చిన బాధ్యతను జగన్ మరిచిపోవడం సరికాదని చురకలు అంటించారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్నారు. వైసీపీ పాలనలో గౌరవ సభను కౌరవ సభగా మార్చిందని దుయ్యబట్టారు.